ETV Bharat / sports

అర్జున అవార్డుకు ఎంపికైన షట్లర్​కు కరోనా

author img

By

Published : Aug 27, 2020, 5:43 PM IST

అర్జున పురస్కారానికి ఎంపికైన యువ షట్లర్ సాత్విక్ సాయిరాజ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. తనకు లక్షణాలు ఏం లేవని చెప్పాడు.

అర్జున అవార్డు అందుకోనున్న షట్లర్​కు కరోనా
షట్లర్ సాత్విక్ సాయిరాజ్

భారత యువ షట్లర్ సాత్విక్ సాయిరాజ్​కు కరోనా సోకింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం(ఆగస్టు 29) అర్జున అవార్డును వర్చువల్​గా అందుకోనున్నాడు ఈ క్రీడాకారుడు.

తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు నెగటివ్ వచ్చిందని, తనకు మాత్రం వైరస్ ఎలా సోకిందో తెలియట్లేదని సాత్విక్ అన్నాడు. లక్షణాలు ఏం కనిపించట్లేదని తెలిపాడు. అమలాపురంలోని తన ఇంట్లో వారం పాటు క్వారంటైన్​లో ఉండనున్నాడు.

2018 కామన్వెల్త్ క్రీడల్లో వెండి పతకం, థాయ్​లాండ్ ఓపెన్​లో స్వర్ణం గెలుచుకున్నారు సాత్విక్-చిరాగ్​ శెట్టి జోడీ. ఫలితంగా వీరిద్దరూ అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారం దక్కడం రానున్న ఒలింపిక్స్​లో పతకం సాధించడంలో స్ఫూర్తి కలిగిస్తుందని సాయిరాజ్​ చెప్పాడు.

sathwik sairaj chirag shetty
సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.