ETV Bharat / sports

'ప్లాన్-బీ'తో ఒలింపిక్స్​కు సాత్విక్-చిరాగ్​ జోడీ

author img

By

Published : Apr 16, 2021, 11:41 AM IST

భారత బ్యాడ్మింటన్​ డబుల్స్​ ఆటగాళ్లు సాత్విక్​ సాయిరాజ్​- చిరాగ్ శెట్టి ఒలింపిక్స్​ కోసం తమ ఆటలో మార్పులు చేసుకున్నట్లు తెలిపారు. కొత్త కోచ్​ మాథియాస్​ బో ఆధ్వర్యంలో యూరోపియన్ శైలి ఆటను నేర్చుకున్నట్లు వెల్లడించారు.

sawtikraj rankyreddy, chirag shetti
సాత్విక్ రాజ్​ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి

టోక్యోలో ఒలింపిక్ పతకమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు.. భారత షటిల్​ ద్వయం సాత్విక్ సాయిరాజ్​ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టి చెబుతున్నారు. ఈ మెగా ఈవెంట్​కు ముందు ఇండియా ఓపెన్​లో ఆడనున్న ఈ జోడీ.. తమ ఆట శైలిని మార్చుకున్నట్లు వెల్లడించింది.

కొత్త కోచ్ మాథియాస్ బో ఆధ్వర్యంలో ప్లాన్​-బీని అమలు చేయనున్నట్లు తెలిపారు. మాథియాస్​ కోచ్​గా ఇంగ్లాండ్​ ఓపెన్​లో తొలి టోర్నీ ఆడిన ఈ జంట.. యూరోపియన్ శైలిలో ఆడేందుకు ప్రయత్నించింది. డెన్మార్క్​ జోడీ కిమ్​ ఆస్ట్రప్​-ఆండెర్స్​ స్కారప్​పై ఓటమిని చవిచూసింది.

"మేము కొత్త తరహా శైలి ఆడటానికి ప్రయత్నిస్తున్నాం. మేం ఉత్తమంగా ఆడకపోవచ్చు. కానీ, గత టోర్నీలో వ్యూహాత్మకంగా, విభిన్నంగా గేమ్​ను అమలుపరిచాం. టోక్యోలో మెడల్ గెలవాలంటే ప్లాన్​-బీతో మేము ఆడాల్సిందే. కొత్త కోచ్​ కింద ఆడనుండటం, కొత్త తరహా ప్రణాళికను అమలు చేయడం ఎప్పటికైనా సవాలే. మేము అన్ని తరహా కోణాల్లో ఆడేటంత నైపుణ్యాన్ని సాధించాం. చిన్న చిన్న తప్పిదాలను సరిదిద్దుకుంటే మేము ఇందులో విజయవంతమవుతాం" అని చిరాగ్ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: స్వర్ణంతో మెరిసిన సరిత.. మరో ఇద్దరికి కాంస్యాలు

అభిమానులు లేకపోవడం లోటే..

కొత్త కోచ్ పట్ల మరో ఆటగాడు రాంకీ రెడ్డి ఆనందం వ్యక్తం చేశాడు. "గతంలో చాలా మంది ఆసియా కోచ్​లు ఉన్నప్పటికీ.. తమ ఆటతీరును మార్చడానికి చాలా ఇబ్బందిగా ఉండేదని తెలిపాడు. ప్రస్తుత కోచ్​ ఆధ్వర్యంలో శిక్షణ బాగుందని వెల్లడించాడు. ఇప్పుడు యూరోపియన్ శైలి ఆటతీరు తమ దగ్గర ఉందని" పేర్కొన్నాడు.

మే 11 నుంచి 16 వరకు భారత్ వేదికగా జరగనున్న ఇండియా ఓపెన్​లో ప్రేక్షకులకు అనుమతి ఇవ్వలేదు నిర్వాహకులు. అయితే అభిమానులు లేకుండా మ్యాచ్​లు ఆడటం కష్టమని రాంకీ రెడ్డి అభిప్రాయపడ్డాడు. 'కుటుంబ సభ్యులు, అభిమానులు వచ్చి మద్దతు ఇస్తారని భావించాం. కానీ, భారత్​లో కరోనా రెండో వేవ్​ పరిస్థితుల్లో బయో బబుల్​లోనే ఆడటం ఉత్తమం' అని పేర్కొన్నాడు.

ఇటీవల కొవిడ్ తప్పుడు నివేదికల నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్​కు ముందే వ్యాక్సినేషన్​ కోసం ఎదురు చూస్తున్నట్లు ఈ ద్వయం వెల్లడించింది.

ఇదీ చదవండి: మ్యాచ్​పై ఆశల్లేవు.. డెత్​ ఓవర్లే కొంప ముంచాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.