ETV Bharat / sitara

'రోజా విషయంలో ఇప్పటికీ బాధపడతా'

author img

By

Published : Feb 9, 2021, 12:15 PM IST

ఈటీవీలో ప్రసారమవుతోన్న ఆలీతో సరదాగా సెలబ్రిటీ షోకి ఇటీవల హాజరయ్యారు నటుడు సురేశ్. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మణిరత్నం 'రోజా' సినిమాలో అవకాశాన్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో తెలిపారు.

Suresh
సురేశ్

తాను కథానాయకుడిగా నటించిన మొదటి సినిమా తొలిరోజు షూటింగ్‌ రొమాన్స్‌తో కూడిన పాట చేయాల్సి వచ్చిందని, అది సరిగా చేయకపోయి ఉంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదని అన్నారు నటుడు సురేశ్‌. కథానాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి అలరించారు ఆయన. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి తన కెరీర్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. 'మణిరత్నం 'రోజా'లో కథానాయకుడిగా అవకాశం వస్తే ఎందుకు వదులుకున్నారు? ఆ సినిమాను వదులుకున్నందుకు బాధపడుతున్నారా?' అని ఆలీ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు.

"బాధపడ్లేదు అంటే అబద్ధం చెప్పిన వాడిని అవుతా. ఈరోజూకీ 'రోజా' పాట ఎక్కడైనా విన్నా.. కొంచెం బాధగా ఉంటుంది. ఐ లవ్ ఆల్ దోస్ సాంగ్స్. ప్రతి పాట నాకిష్టం. నేను 'రోజా' సినిమా చూశా. నేను చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. 'పరువు ప్రతిష్ఠ' కోసం ఈ చిత్రం వదులుకోవాల్సి వచ్చింది. రామానాయుడి గారికి నో చెప్పగలమా?. అదీ పరిస్థితి " అంటూ చెప్పుకొచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.