తెలుగు సినీ పరిశ్రమను ప్రేక్షకులు ఆదుకోవాలి: ఎన్టీఆర్

author img

By

Published : Jan 8, 2022, 6:14 PM IST

NTR

తెలుగు చిత్ర పరిశ్రమను ప్రేక్షకులు ఆదుకోవాలని యంగ్​టైగర్​ ఎన్టీఆర్ కోరారు. కరోనా నిబంధనలను పాటిస్తూ థియేటర్లలో సినిమాలను చూడాలని అన్నారు.

ఈ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలను థియేటర్లలోనే చూసి తెలుగు సినీపరిశ్రమను ఆదుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. కొత్త చిత్రాలను, నటీనటులను ప్రోత్సహించే గొప్ప మనసు తెలుగు ప్రేక్షకులకు ఉంటుందన్న తారక్.. దిల్​రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న 'రౌడీ బాయ్స్' సినిమా ట్రైలర్​ను లాంఛనంగా విడుదల చేశారు. 'ప్రేమదేశం' తరహాలో సాగిపోయే 'రౌడీబాయ్స్' చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

'రౌడీ బాయ్స్​' ట్రైలర్​ లాంచ్ సందర్భంగా మాట్లాడుతున్న ఎన్టీఆర్

ఈ సందర్భంగా దిల్ రాజు, శిరీష్​లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఎన్టీఆర్.. కథానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్న అశీష్ నటుడిగా ఎన్నో మంచి చిత్రాలు చేయాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలంతా కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.

NTR
'రౌడీ బాయ్స్' ట్రైలర్​ లాంచ్ చేసిన తారక్

'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాను తెరకెక్కించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'టాలీవుడ్​కు అందుకే దూరమయ్యా'.. రూమర్లపై సమీరా రెడ్డి క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.