ETV Bharat / sitara

క్రిష్​ దర్శకత్వంలో జోడీగా వైష్ణవ్​ తేజ్​, రకుల్​ప్రీత్​​

author img

By

Published : Aug 15, 2020, 5:01 AM IST

Rakul Preet to romance Vaishnav Tej in Krish directorial
క్రిష్​ దర్శకత్వంలో జోడీగా వైష్ణవ్​ తేజ్​, రకుల్​ప్రీత్​​

యువ కథానాయకుడు వైష్ణవ్​ తేజ్​, రకుల్​ప్రీత్​ సింగ్​ హీరోహీరోయిన్లుగా.. క్రిష్​ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం వేడుకను శుక్రవారం హైదరాబాద్​లో నిర్వహించింది చిత్రబృందం. శనివారం నుంచి రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభం కానున్నట్లు తెలిపింది.

టాలీవుడ్​లో మరో క్రేజీ కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. స్టార్​ హీరోయిన్​ రకుల్​ప్రీత్​, యువ హీరో వైష్ణవ్​ తేజ్​తో కలిసి నటించనున్న చిత్రానికి.. ముహూర్తపు వేడుకను శుక్రవారం ఉదయం నిర్వహించింది చిత్రబృందం. రేపటి నుంచి చిత్రీకరణ ప్రారంభంకానున్నట్లు వెల్లడించింది. ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్​) ఈ చిత్రానికి దర్శకుడిగా ఉన్నారు. అంతేకాకుండా సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

క్రిష్​ ప్రస్తుతం పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ 27వ చిత్రంతో బిజీగా ఉన్నారు. కరోనా లాక్​డౌన్​ కారణంగా దానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్స్​ వర్క్స్​ నిలిచిపోయాయి. పవన్​ చిత్రానికి తాత్కాలిక విరామం వచ్చిన కారణంగా వైష్ణవ్​ తేజ్​తో సినిమాను పట్టాలెక్కించారు​. ఈ సినిమా షూటింగ్​ను త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తోంది చిత్రబృందం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.