ETV Bharat / sitara

కరోనాపై టాలీవుడ్​లో మూడో సినిమా

author img

By

Published : Jun 19, 2020, 7:16 AM IST

rakshit
రక్షిత్​

కరోనాపై టాలీవుడ్​లో మరో సినిమా తీస్తున్నారు. 'డబ్ల్యుహెచ్‌ఓ' అనే పేరుతో దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇందులో 'పలాస 1978' ఫేమ్ రక్షిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా.. లక్షలమందిని బలితీసుకుంటోంది. అయితే ఈ వైరస్​ను ఆధారంగా చేసుకుని​ టాలీవుడ్​లో సినిమాలు తీసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ప్రశాంత్​ వర్మ, రామ్​గోపాల్​ వర్మ.. ఇలాంటి కథలో చిత్రాలు రూపొందిస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్​లను ఇప్పటికే విడుదల చేశారు.

తాజాగా ఈ వైరస్​ నేపథ్య కథాంశంతో 'డబ్ల్యుహెచ్‌ఓ' అనే మరో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో 'పలాస 1978' ఫేమ్ రక్షిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. గురువారం అతడి పుట్టినరోజు సందర్భంగా చిత్రానికి సంబంధించిన పోస్టర్​ను విడుదల చేశారు. 'ఐ యామ్‌ గోనా టెల్‌ గాడ్‌ ఎవ్రీథింగ్‌' అనే వైవిధ్యమైన హాలీవుడ్ షార్ట్ ఫిలింతో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన దేవ్ పిన్నమరాజు.. దీనితో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

rakshit
రక్షిత్​

కరోనా, దాని వెనక ఎలాంటి కుట్ర జరిగిందనే కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. సుధాస్ మీడియా భారీ స్థాయిలో నిర్మించనుంది. అమెరికా, ఇటలీ, దక్షిణాఫ్రికా, ఇండియా-చైనా సరిహద్దుల్లో చిత్రీకరణ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

rakshit
రక్షిత్​

ఇది చూడండి : మెగా హీరోయిన్​ నిహారిక పెళ్లి ఇతడితోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.