ETV Bharat / sitara

ప్లాస్మా సంజీవనితో సమానం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

author img

By

Published : Aug 18, 2020, 2:11 PM IST

ప్లాస్మా అనేది ప్రాణాలు కాపాడే సంజీవనితో సమానమని ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి పేర్కొన్నారు. ప్లాస్మా దానంపై అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు.

music Director keeravani participates in an awareness program on plasma donation
ప్లాస్మా సంజీవనితో సమానం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీపీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్‌.కీరవాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ప్లాస్మా సంజీవనితో సమానం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి పేర్కొన్నారు. ప్లాస్మా అనేది ప్రాణాలు కాపాడే సంజీవనితో సమానమని తెలిపారు. ప్లాస్మా దాతలందరూ ప్రాణదాతలని కొనియాడారు. ఈ విషయంలో అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దన్న ఆయన.. మా కుటుంబం, సిబ్బంది ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఇదీచూడండి: ప్లాస్మా దానం చేసేందుకు ఎవరూ భయపడొద్దు: రాజమౌళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.