ETV Bharat / sitara

హీరో సూర్య దాతృత్వం.. ఆదివాసీలకు రూ.కోటి విరాళం

author img

By

Published : Nov 1, 2021, 3:09 PM IST

స్టార్​ కపుల్​ సూర్య(suriya movies), జ్యోతిక మరోసారి మంచి మనసును చాటుకున్నారు. తమిళనాడులోని ఆదివాసీల సంక్షేమం కోసం రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. సీఎం స్టాలిన్(cm stalin helpline number)​ సమక్షంలో తమిళనాడుకు చెందిన ఇరులర్​ ట్రైబ్​ ట్రస్ట్​కు(irula tribe in which state) చెక్​ అందజేశారు.

Suriya news
సూర్య

కోలీవుడ్​ స్టార్​ హీరో సూర్య, జ్యోతిక(suriya jyothika movies) దంపతులు మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. తమిళనాడుకు చెందిన ఇరులర్​ ట్రైబ్​(ఆదివాసీల) సంక్షేమం కోసం రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్​(cm stalin helpline number) సమక్షంలో చెక్​ను హైకోర్టు రిటైర్డ్​ న్యాయమూర్తి చంద్రూ, పాజ్హన్​కుడి ఇరులర్​ ట్రస్ట్​కు అందజేశారు. అంతకముందు కరోనా సమయంలోనూ తమ రాష్ట్ర సీఎం రిలీఫ్​ ఫండ్​కు ఈ దంపతులు విరాళం ఇచ్చారు.

సూర్య నటించిన కొత్త చిత్రం 'జై భీమ్'(jai bhim release date)​.. నవంబరు 2నుంచి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అమెజాన్​ ప్రైమ్​లో(amazon prime movies) స్ట్రీమింగ్​ కానుంది. జ్ఞానవేల్‌ దర్శకుడు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ కోర్టు డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొందించారు. ఏ తప్పు చేయని బలహీన వర్గ(ఆదివాసి) మహిళను కేసు నుంచి బయటపడేసే లాయర్ పాత్రలో సూర్య కనిపించనున్నారు.

Suriya jai bheem movie
జై భీమ్ సినిమాలో సూర్య

హైకోర్టు రిటైర్డ్​ న్యాయమూర్తి చంద్రూ బయోపిక్​ ఇది. సూర్య 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్​, సాంగ్స్​ అభిమానులను ఆకట్టుకున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.