ETV Bharat / sitara

కరోనా కట్టడికి సూర్య ఫ్యామిలీ రూ.కోటి విరాళం

author img

By

Published : May 13, 2021, 12:37 PM IST

కరోనా కట్టడిలో భాగంగా తమిళనాడు ప్రభుత్వానికి అండగా నిలిచారు కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తి. వీరి కుటుంబం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1 కోటి విరాళం ప్రకటించింది.

Actor Suriya family donated Rs 1 crore to Corona relief fund
కరోనా కట్టడికి సూర్య, కార్తి రూ.కోటి విరాళం

కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు సెలబ్రిటీలు. వారికి తోచిన సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. తాజాగా కోలీవుడ్ హీరోలు సూర్య, కార్తి కూడా బాధితులకు అండగా నిలిచారు. తమిళనాడు ప్రభుత్వ సహాయనిధికి వీరి కుటుంబం రూ. 1 కోటి విరాళం ప్రకటించింది. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి స్టాలిన్​ను కలిసిన వారు ఆయనను సత్కరించి.. ఈ సాయం అందజేశారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం చేయాలని అభ్యర్థించారు.

స్టాలిన్​ని కలిసిన సూర్య ఫ్యామిలీ

సూర్య ఈ ఏడాది 'ఆకాశం నీ హద్దురా' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ అందుకుంది. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు సూర్య. అలాగే 'సుల్తాన్' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు కార్తి. ఈ సినిమా కూడా విజయం సాధించింది. ప్రస్తుతం 'సర్దార్'​, 'పొన్నియన్ సెల్వన్' చిత్రాలతో బిజీగా ఉన్నారు కార్తి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.