ETV Bharat / sitara

అనారోగ్యానికి గురైన నటుడు మిథున్ చక్రవర్తి

author img

By

Published : Dec 20, 2020, 4:03 PM IST

బాలీవుడ్​ దిగ్గజ నటుడు మిథున్​ చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు. 'ది కశ్మీర్​ ఫైల్స్​' సినిమా చిత్రీకరణలో ఉండగా ఆయనకు వాంతులు, విరేచనాలు అయ్యాయి.

Bollywood actor Mithun Chakraborty's health deteriorates
అనారోగ్యానికి గురైన బాలీవుడ్​ నటుడు మిథున్ చక్రవర్తి

బాలీవుడ్​ సీనియర్​ నటుడు మిథున్​ చక్రవర్తి అనారోగ్యం బారిన పడ్డారు. ఉత్తరాఖండ్​ ముస్సోరీలో ఓ సినిమా షూటింగ్​లో ఉన్న ఆయనకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. అక్కడే ఓ హోటల్​లో ఉన్న ఆయనను వైద్యులు పరీక్షించారు. మిథున్​ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నప్పటికీ.. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

'ది కశ్మీర్​ ఫైల్స్​' చిత్రీకరణ కోసం ముస్సోరీకి వెళ్లారు మిథున్​. ఆయనతో పాటు అనుపమ్​ ఖేర్​ వంటి నటులు ఈ షూటింగ్​లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మిథున్​ అనారోగ్యంగా ఉండడం వల్ల చిత్రీకరణకు హాజరు కాలేకపోతున్నారు. ముస్సోరీలో షెడ్యూల్​ పూర్తైన తర్వాత దెహ్రాదూన్​, రిషికేశ్​కు వెళ్లనుందీ చిత్రబృందం.

ఇదీ చూడండి:''ఆచార్య'లో ఆ సీన్ రీషూట్ చేశాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.