ETV Bharat / sitara

పాన్ ఇండియా సినిమా.. ముంబయిలో ఫ్లాట్!

author img

By

Published : Jul 9, 2021, 5:31 AM IST

After Ram Charan, samantha to buy a flat in Mumbai?
విజయ్ దేవరకొండ సమంత రామ్​చరణ్

పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అలరిస్తున్న పలువురు టాలీవుడ్ సినీ తారలు.. తమ మకాం ముంబయికి మార్చేసేందుకు సిద్ధమవుతున్నారు! అక్కడే సొంత ఫ్లాట్​ కొనుగోలు చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ తారలెవరు?

గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా సినిమాల వల్ల తెలుగు సినీ పరిశ్రమతో పాటు తారల స్టార్​డమ్ కూడా పెరుగుతోంది. హిందీలోనూ వారికి పలువురు దర్శకనిర్మాతలు ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో ప్రభాస్, విజయ్ దేవరకొండ, రష్మిక లాంటి నటీనటులు ముంబయిలో ఫ్లాట్స్​ కొని అక్కడా సెటిలవుతున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు స్టార్స్ కూడా అక్కడ సొంత ఫ్లాట్​ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

.
.

'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్న రామ్​చరణ్​.. సతీమణి ఉపాసనతో కలిసి స్నేహితులకు గతవారం పార్టీ ఇచ్చారట. ముంబయిలో ఫ్లాట్​ కొన్నందుకేనని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం చేస్తున్న చిత్రం, ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్టు కూడా పాన్ ఇండియావే కావడం వల్ల చరణ్.. ముంబయిలోనూ ఓ ఫ్లాట్​ తీసుకుంటే బాగుంటుందని భావించారట.

అలానే ముద్దుగుమ్మ సమంత కూడా అక్కడ ఖరీదైన ఫ్లాట్​ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్​తో ఆకట్టుకుని, దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుందీ భామ. దీంతో పలువురు హిందీ దర్శకనిర్మాతలు ఈమెను సంప్రదిస్తున్నారట. దీంతో తన మకాం ముంబయి మార్చుకుందట సమంత. ప్రస్తుతం ఈమె 'శాకుంతలం' అనే పీరియాడికల్ డ్రామాలో నటిస్తోంది.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.