ETV Bharat / sitara

అడివి శేష్ 'మేజర్' గ్లింప్స్.. త్వరలో టీజర్

author img

By

Published : Mar 15, 2021, 4:13 PM IST

అడివి శేష్-మహేశ్​బాబు కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'మేజర్' సినిమా గ్లింప్స్​ను విడుదల చేశారు. టీజర్​ను మార్చి 28న రిలీజ్ చేయనున్నారు.

adivi sesh MAJOR glimpse released
అడివి శేష్ 'మేజర్' గ్లింప్స్

26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'మేజర్'. సోమవారం(మార్చి 15) ఆయన జయంతి సందర్భంగా చిత్ర గ్లింప్స్​ను ట్వీట్ చేశారు.

ఈ సినిమాలో అడివి శేష్​, సందీప్ పాత్రలో కనిపించనున్నారు. శోభిత దూళిపాళ్ల, సయీ మంజ్రేకర్​ కథానాయికలు. సూపర్​స్టార్ మహేశ్​బాబు నిర్మిస్తుండగా, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది జులై 2న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇది చదవండి: చిరకాల మిత్రుడితో చిరంజీవి సిక్కిం టూర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.