షెర్లిన్ చోప్రాపై రూ.50 కోట్ల పరువు నష్టం దావా

author img

By

Published : Oct 19, 2021, 5:35 PM IST

Sherlin chopra

పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్​కుంద్రా(raj kundra and sherlyn chopra) ఇటీవలే బెయిల్​పై విడుదలయ్యారు. ఈ కేసు ప్రారంభంలోనే ఆయనపై పలు ఆరోపణలు చేసింది నటి షెర్లిన్ చోప్రా(sherlyn chopra raj kundra). తాజాగా ఈ వార్తలను ఖండించిన శిల్పాశెట్టి, రాజ్​కుంద్రా.. ఆమెపై పరువు నష్టం దావా వేశారు.

పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్​ కుంద్రా(raj kundra and sherlyn chopra) ఇటీవలే బెయిల్​పై విడుదలయ్యారు. ఈ కేసు ప్రారంభంలోనే ఆయనపై బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా(raj kundra and sherlyn chopra) పలు ఆరోపణలు చేసింది. తనను బెదిరించి తనపై అశ్లీల చిత్రాలు చిత్రీకరించారని పేర్కొంది. ఈ విషయమై సాయం కోరుతూ పోలీసుల్ని ఆశ్రయించింది. తాజాగా ఈ ఆరోపణలపై స్పందించిన శిల్ప, కుంద్రా.. షెర్లిన్​పై పరువు నష్టం(sherlyn chopra defamation case) దావా వేశారు.

ఈ కేసు విషయంలో షెర్లిన్‌ చోప్రా చేసిన ఆరోపణలు నిరాధారమని, అవన్నీ కల్పితాలంటూ కొట్టిపారేసిన శిల్పా దంపతుల తరఫున న్యాయవాదులు రూ.50 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. అలాంటి ఆరోపణలతో మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఆమె ప్రయత్నిస్తుందంటూ పేర్కొన్నారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించారు.

ఇవీ చూడండి: పవన్​ కల్యాణ్​తో మంచు విష్ణు.. ఆ వార్తలకు చెక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.