ETV Bharat / science-and-technology

PM Modi ISRO Address : '2035 నాటికి అంతరిక్ష కేంద్రం.. 2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుడు'.. ఇస్రోకు మోదీ దిశానిర్దేశం

author img

By PTI

Published : Oct 17, 2023, 3:18 PM IST

Updated : Oct 17, 2023, 3:32 PM IST

PM Modi ISRO Address : రోదసీ​ రంగంలో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు కీలక లక్ష్యాలు నిర్దేశించారు ప్రధాని నరేంద్ర మోదీ. 2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయుడిని పంపే విధంగా ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. 2035 నాటికి భారత స్పేస్ సెంటర్​ను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

PM Modi ISRO Address
PM Modi ISRO Address

PM Modi ISRO Address : స్పేస్​లోకి మనుషులను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్​యాన్ మిషన్ ఏర్పాట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. త్వరలోనే మానవరహిత ఫ్లైట్ టెస్టులు నిర్వహించేందుకు ఇస్రో సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ప్రధాని.. ఆ వివరాలను మంగళవారం అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు భారత్ చేపట్టనున్న ఈ తొలి మిషన్.. 2025లో జరిగే అవకాశం ఉందని పీఎంఓ పేర్కొంది. అక్టోబర్ 21న గగన్​యాన్ తొలి ఫ్లైట్ టెస్టును ఇస్రో నిర్వహించనున్నట్లు తెలిపింది.

సరికొత్త లక్ష్యాలు
Indian Space Station : ఈ సందర్భంగా.. మరిన్ని కొత్త పరిశోధనలు చేపట్టాలని ఇస్రో శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. భవిష్యత్​లో చేపట్టబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. 2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయుడిని ( First Indian To Land On Moon ) పంపించాలని ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ సూచించారు. 2035 నాటికి అంతరిక్షంలో భారత స్పేస్​ స్టేషన్​ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంగారక గ్రహంపైకి ల్యాండర్​ను పంపించాలని మోదీ పేర్కొన్నారు. శుక్రగ్రహం వద్దకు ఆర్బిటార్​ను పంపించే మిషన్​పై పని చేయాలని సూచించారు.

  • VIDEO | PM Modi chaired a high-level meeting to assess progress of India’s Gaganyaan Mission and to outline the future of India’s space exploration endeavours earlier today.

    The Department of Space presented a comprehensive overview of the Gaganyaan Mission, including various… pic.twitter.com/Q2fBqPvoS2

    — Press Trust of India (@PTI_News) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 మిషన్ల విజయాల పరంపరకు కొనసాగింపుగా.. సరికొత్త లక్ష్యాలతో ముందుకెళ్లాలని మోదీ దిశానిర్దేశం చేశారు. చంద్రుడిపై పరిశోధనలకు భారత ప్రభుత్వంలోని స్పేస్ డిపార్ట్​మెంట్ రోడ్​మ్యాప్ సిద్ధం చేస్తుందని తెలిపారు. చంద్రయాన్ ప్రయోగాలను సమీక్షించడం, తర్వాతి తరం లాంఛ్ వాహనాలను (ఎన్​జీఎల్​వీ) నిర్మించడం, కొత్త లాంఛ్ ప్యాడ్​ను అభివృద్ధి చేయడం, మానవకేంద్రంగా నడిచే ల్యాబ్​లు, అనుబంధ సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు ఈ రోడ్​మ్యాప్ ఉపయోగపడుతుంది."
-పీఎంఓ ప్రకటన

20 ప్రయోగాలు.. 3 మానవరహిత మిషన్లు..
గగన్​యాన్ మిషన్​ పురోగతిపై చేపట్టిన ఉన్నత స్థాయి సమీక్షలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గగన్​యాన్ మిషన్​పై సమగ్ర వివరాలను మోదీకి సోమనాథ్ తెలియజేశారు. ఇప్పటివరకు అభివృద్ధి చేసిన సాంకేతికతల గురించి వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 20 భారీ ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది. మూడు మానవరహిత మిషన్లను ప్రయోగించనుంది.

Chandrayaan 3 Soft Landing Again : ఈసారి మనుషులతో 'చంద్రయాన్​'.. ఇస్రో విక్రమ్ 'రిటర్న్' జర్నీ సక్సెస్​!

పొదుపు మంత్రం ఇప్పుడు ఓకే.. కానీ ఫ్యూచర్​లో భారీ రాకెట్లు అవసరం : ఇస్రో మాజీ చీఫ్​ శివన్​

Last Updated : Oct 17, 2023, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.