ETV Bharat / priya

నోరూరించే రొయ్యదోశలు.. తింటే వదలరు!

author img

By

Published : Aug 19, 2021, 8:15 AM IST

రొయ్యదోశలు
రొయ్యదోశలు

మాంసాహార​ పదార్థాల్లో రొయ్యలది ప్రత్యేక స్థానం. వాటితో బిర్యానీ, ఫ్రై, పులుసు, పచ్చడి లాంటి చాలా వెరైటీలు చేస్తుంటారు. అందుబాటులో కూడా ఉంటాయి. అయితే గోదావరి జిల్లాల్లో లభ్యమయ్యే అత్యంత రుచికరమైన రొయ్యదోశల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లి దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, రవ్వ దోశ.. ఇలా చాలా రకాల దోశలు మీరు తినే ఉంటారు. కానీ రొయ్య దోశ గురించి ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ తెలియకపోతే ఈ స్టోరీ చదివేయండి. వెంటనే చేసేసుకోండి.

కావాల్సిన పదార్ధాలు:

రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు తగినంత, నూనె, కొత్తిమీర, ఎండుమిర్చి, జీలకర్ర, ఉడికించిన గుడ్డు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తయారీ విధానం:

ముందుగా ఓ బేసిన్​లో రొయ్యలు, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కనపెట్టుకోవాలి. తరువాత మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేయించి పొడి చేయాలి. ఇప్పుడు పొయ్యిమీద ఓ పాత్రను ఉంచి నూనె, ఉల్లిపాయల ముక్కలు వేసి వేయించాలి. అందులో పచ్చిమిర్చి, ధనియాలపొడి, గరం మసాలా, ముందుగా కలిపిపెట్టుకున్న వేసి రొయ్యలు వేసి వేపుడు చేసుకోవాలి.

అనంతరం ఓ స్టవ్​ వెలిగింది, దానిపై పెనం పెట్టి చిన్నసైజు దోశలు వేయాలి. వాటిపైన వేయించిన రొయ్యలు, నూనె, ముందుగా చేసుకున్న మసాలా పొడి వేసి రెండువైపులా బాగా కాల్చుకోవాలి. చివరగా దానిపై ఉడికించిన గుడ్డు తురుము, కొత్తిమీర చల్లుకుని దించేయాలి. అంతే ఎంతో రుచికరమైన రొయ్య దోశలు రెడీ.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.