LIVE : తెలంగాణ భవన్‌లో పారిశుద్ద్య కార్మికులతో కలిసి కేటీఆర్ భోజనం

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 1:35 PM IST

Updated : Jan 1, 2024, 1:52 PM IST

thumbnail

తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు 2023కు ఘనంగా వీడ్కోలు పలికి అంతకుమించి గ్రాండ్​గా 2024 కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఈ ఏడాదంతా ఎంతో ఉత్సాహంగా ఉండాలని ఆశిస్తూ ఉత్సాహంగా న్యూ ఇయర్​కు వెల్​కమ్ చెప్పారు. ఇక కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ప్రజలకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ న్యూ ఇయర్ సందేశాన్ని ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్​కు వచ్చిన వారంతా కేటీఆర్​ను కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Last Updated : Jan 1, 2024, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.