హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి వద్ద రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ముందు ఉన్న బస్సును వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొంది. ఈ ఘటనలో వెనక నుంచి ఢీకొట్టిన బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు అవగా... యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని పోలీసులు అంటున్నారు.
ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే రహదారిపై ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సును తొలగించి ట్రాఫిక్ను నియంత్రించారు.
ఇదీ చదవండి: చివరికి గ్రేహౌండ్స్ భూములనూ వదల్లేదు!