ETV Bharat / jagte-raho

నిమ్స్ ఆస్పత్రి వద్ద రెండు బస్సులు ఢీ

author img

By

Published : Dec 12, 2020, 9:11 AM IST

two travels buses collide with each other in hyderabad
నిమ్స్ ఆస్పత్రి వద్ద రెండు బస్సులు ఢీ

హైదరాబాద్​లో నిమ్స్ ఆస్పత్రి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ కొన్నాయి. ఖైరతాబాద్-పంజాగుట్ట రహదారిపై ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్​ నిమ్స్‌ ఆస్పత్రి వద్ద రెండు ట్రావెల్స్‌ బస్సులు ఢీకొన్నాయి. ముందు ఉన్న బస్సును వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొంది. ఈ ఘటనలో వెనక నుంచి ఢీకొట్టిన బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అవగా... యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని పోలీసులు అంటున్నారు.

ఖైరతాబాద్‌ నుంచి పంజాగుట్ట వెళ్లే రహదారిపై ట్రాఫిక్​కి అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సును తొలగించి ట్రాఫిక్‌ను నియంత్రించారు.

ఇదీ చదవండి: చివరికి గ్రేహౌండ్స్‌ భూములనూ వదల్లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.