ETV Bharat / jagte-raho

వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు చిన్నారులు

author img

By

Published : Oct 3, 2020, 12:03 PM IST

street dogs attack on children
వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు చిన్నారులు

ఇంటి ముందు ఆడుకుంటుండగా రెండు వీధికుక్కలు ఇద్దరు చిన్నారులపై దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లా రావినూతన గ్రామంలో జరిగింది. చిన్నారుల ముఖంపై తీవ్రగాయాలు కాగా చికిత్స కోసం వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్​ మండలం రావినూతన గ్రామానికి చెందిన మణికంఠ, పూర్ణశ్రీ అనే ఇద్దరు చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటుండగా రెండు వీధికుక్కులు వారిపై దాడి చేశాయి. వారిని కాపాడబోయి.. శునకాలను అడ్డుకోబోయిన మరో మహిళపైనా అవి దాడికి పాల్పడ్డాయి.

చిన్నారులు ఇద్దరి ముఖంపైనా తీవ్రగాయాలయ్యాయి. వారిని బోనకల్ పీహెచ్​లో ప్రాథమిక వైద్యం చేసి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి తమ ప్రాంతంలో ఉన్న వీధికుక్కలను తరిమికొట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండిః పిచ్చికుక్క స్వైర విహారం.. తొమ్మిది మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.