ETV Bharat / jagte-raho

కాళ్లు కడుక్కొని వస్తానని చెప్పి.. శవమై తేలాడు

author img

By

Published : Dec 13, 2020, 10:16 AM IST

khammam crime news
కాళ్లు కడుక్కొని వస్తానని చెప్పి.. శవమై తేలాడు

ఖమ్మం జిల్లా కారేపల్లి పెద్దచెరువులోపడి ఏడేళ్ల బాలుడు మృత్యవాత పడ్డాడు. కాళ్లు కడుక్కొని వస్తానని చెప్పి.. చెరువులో శవమై తేలాడు.

ఖమ్మం జిల్లా కారేపల్లిలో విషాదం చోటుచేసుకొంది. బర్రెలు మేపడానికి వెళ్లిన ఏడేళ్ల బాలుడు చెరువులో పడి మృతిచెందాడు.

కారేపల్లికి చెందిన బాలకృష్ణ-త్రివేణి దంపతుల కుమారుడు కంటేశ్వర్. తాత, అన్నయ్య వరసయ్యే వ్యక్తితో కలిసి పెద్ద చెరువు సమీపంలోని తులస్యా తండా వైపు బర్రెలు మేపేందుకు వెళ్లారు. తాత పొలం వైపు వెళ్లగా.. కాళ్లకు అంటుకున్న బురద కడుక్కొని వస్తానని చెప్పి.. చెరువు వైపు వెళ్లాడు.

ఎంతసేపటికీ రాకపోవడంతో కంగారుపడ్డ సోదరుడు, తాత చుట్టుపక్కల గాలించారు. చెరువు సమీపంలో కండువా కనిపించడం వల్ల అందులో వెతికారు. చెరువులో బాలుడి మృతదేహం చూసి ఒక్కసారిగా అంతా హతాసులయ్యారు.

ఇవీచూడండి: ముత్తంగిలో రోడ్డు ప్రమాదం.. అతివేగంతో టిప్పర్​ను ఢీకొని ఇద్దరి మృతి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.