ETV Bharat / jagte-raho

250 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

author img

By

Published : Feb 2, 2021, 11:22 AM IST

250 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు, పోలీసులు సంయుక్తంగా సీజ్ చేశారు. షాద్​నగర్​ నుంచి మహారాష్ట్రలోని బలాస ప్రాంతానికి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.

250 క్వింటాళ్ల అక్రమ రేషన్​ బియ్యం పట్టివేత
250 క్వింటాళ్ల అక్రమ రేషన్​ బియ్యం పట్టివేత

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు శివారు బాహ్య వలయ రహదారి కూడలిలో పౌరసరఫరాల అధికారులు, పోలీసులు సంయుక్తంగా 250 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పౌరసరఫరాల ఉప తహసీల్దార్ సురేశ్​కు షాద్​నగర్​ నుంచి రేషన్​ బియ్యాన్ని ఓ లారీలో తరలిస్తున్నారని సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

Seizure of 250 quintals of illegal ration rice
250 క్వింటాళ్ల అక్రమ రేషన్​ బియ్యం పట్టివేత

ఈ సోదాల్లో కేఏ 56 1130 అనే లారీలో 250 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. అయితే ఇవి షాద్​నగర్​ నుంచి మహారాష్ట్రలోని బలాస ప్రాంతానికి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ రేషన్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్​ చేశామని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.