ETV Bharat / jagte-raho

ఫైనాన్స్ కార్యాలయం ముందు మృతదేహంతో ధర్నా

author img

By

Published : Dec 15, 2020, 10:06 PM IST

protest with deadbody infront finance office in manchiryala district
ఫైనాన్స్ కార్యాలయం ముందు మృతదేహంతో ధర్నా

వాయిదాలు సక్రమంగా చెల్లించక పోవటం వల్ల ఫైనాన్స్ నిర్వాహకులు తన లారీని లాక్కోవటంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. ఫైనాన్స్​ కార్యాలయం ముందు మృతదేహంతో మృతుని బంధువులు ధర్నా దిగారు. ఈ ఘటన మంచిర్యాలలో జరిగింది.

మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన రవీందర్ అనే వ్యక్తి ఫైనాన్స్​లో లారీని తీసుకున్నాడు. అయితే నెలవారీగా డబ్బులు చెల్లించలేదని ఫైనాన్స్ నిర్వాహకులు లారీని స్వాధీనం చేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన రవీందర్​ అనారోగ్యం పాలై కరీంనగర్​లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

రవీందర్ మృతికి ఫైనాన్స్ నిర్వాహకులు కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో ఫైనాన్స్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.

ఇదీ చదవండి: రేపు దిల్లీ వెళ్లనున్న ఎంపీ రేవంత్​ రెడ్డి.. పీసీసీ కోసమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.