ETV Bharat / jagte-raho

మద్యం మత్తులో బావిలో దూకిన వ్యక్తి మృతి

author img

By

Published : Nov 11, 2020, 7:32 PM IST

మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంటలో విషాదం జరిగింది. తాగిన మైకంలో ఓ వ్యవసాయ బావిలో దూకిన వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

One persondied in keesara mandal medchal dist climb into the water
మద్యం మత్తులో బావిలో దూకిన వ్యక్తి మృతి

మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంటలో మద్యం మత్తులో బావిలో దూకిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. సమీపంలోని ఓ వ్యవసాయ బావిలోకి తాగిన మైకంలో ముగ్గురు వ్యక్తులు దూకారు. అందులో గంగారాం(40) అనే వ్యక్తి ఈత రాకపోవడంతో మృతి చెందాడు.

మృతునికి ముగ్గురు పిల్లలు ఉండడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు కీసర సీఐ నరేందర్ గౌడ్ తెలిపారు.

ఇదీ చూడండి:అదుపుతప్పి గోడను ఢీకొట్టిన ద్విచక్రవాహనం... యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.