ETV Bharat / jagte-raho

అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొన్న బైక్.. బాలుడు మృతి

author img

By

Published : Jan 10, 2021, 3:39 PM IST

minor boy died in an accident
షామీర్​పేటలో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొన్న బైక్

మేడ్చల్ జిల్లా షామీర్​పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ద్విచక్రవాహనం స్తంభానికి ఢీకొట్టడం వల్ల బైక్​పై వెళ్తున్న బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేట నుంచి జగన్​గూడా వెళ్లే దారిలో ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి స్తంభానికి ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్​ నడుపుతున్న బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో బాలిక పరిస్థతి విషమంగా ఉంది.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలికను మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.