ETV Bharat / jagte-raho

మావోల ఘాతుకం... ఇన్​ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య

author img

By

Published : Oct 21, 2020, 12:21 PM IST

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో గల మల్కాన్​గిరి జిల్లాలో... ఇన్​ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. ఇటీవల మావోయిస్టులు... భద్రత బలగాలు లక్ష్యంగా పాతి పెట్టిన 7 మందుపాతరలు గురించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో హత్య చేశారని సమాచారం..

ఇన్​ఫార్మర్ నెపంతో గిరిజనుడిని హత్య చేసిన మావోలు
ఇన్​ఫార్మర్ నెపంతో గిరిజనుడిని హత్య చేసిన మావోలు

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో గల మల్కాన్​గిరి జిల్లాలో.. ఇన్​ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. మల్కాన్​గిరి జిల్లా కట్ ఆఫ్ ఏరియాలో గల జోడం పంచాయతీ ఖజిరిపుట్ గ్రామంలో దాస్ కీముడు అనే 25 ఏళ్ల యువకుడిని చంపేశారు.

ఇటీవల మావోయిస్టులు.. భద్రత బలగాలు లక్ష్యంగా పాతి పెట్టిన 7 మందుపాతరల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వటం వల్ల హత్య చేశారని.. అదే గ్రామనికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను సైతం మావోయిస్టులు గాయపరిచినట్లు సమాచారం. ఈ ఘటనతో కట్ ఆఫ్ ఏరియాలోని గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఇదీ చదవండి: మావోయిస్టుల ఆగడాలకు కళ్లెం వేసేందుకు పటిష్ఠ చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.