ETV Bharat / jagte-raho

ఫోన్ రిపేర్​ కోసం వెళితే.. ఏం చేశాడో తెలుసా?

author img

By

Published : Jan 28, 2021, 10:17 PM IST

Updated : Jan 28, 2021, 10:46 PM IST

facebook-cheater-arrested-by-rachakonda-crime-police
ఫోన్ రిపేర్​ కోసం వెళితే.. ఏం చేశాడో తెలుసా?

చరవాణి మరమ్మతులు చేసే వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ రిపేర్​కు వెళ్లిన ఓ యువతి ఫోటోలను ఫేస్​బుక్ నుంచి దొంగిలించి.. నకిలీ ఖాతా తెరిచాడు. ఆలస్యంగా తెలుసుకున్న యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అబిడ్స్​లోని జగదీశ్ మార్కెట్​లో చరవాణి మరమ్మతులు చేసే అశోక్ పాటిల్ అనే యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది మార్చిలో ఓ యువతి తన ఫోన్​ రిపేర్​ కోసం అశోక్ దుకాణానికి వెళ్లింది. రిపేర్​ చేయడానికి రెండు రోజుల సమయం పడుతుందని చెప్పి చరవాణిని తన వద్దే ఉంచుకున్నాడు.

మరమ్మతు చేశాక యువతి ఫేస్​బుక్​లోని ఫోటోలన్నింటిని తన లాప్​టాప్​లోకి కాపీ​ చేసుకున్నాడు. అనంతరం సదరు యువతి పేరు మీద నకిలీ ఫేస్​బుక్ ఖాతా తెరిచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న యువతి.. రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: పీఆర్‌సీ నివేదికపై ఆందోళన వద్దు: మంత్రి శ్రీనివాసగౌడ్​

Last Updated :Jan 28, 2021, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.