మెదక్ జిల్లా పాపన్నపేటలో పదుల సంఖ్యలో నెమళ్లు చనిపోవడం కలకలం రేపుతోంది. గ్రామశివారులోని వెంకటేశ్వర గట్టు సమీపంలో నెమళ్లు చనిపోవడాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఒకేసారి పదికిపైగా నెమళ్లు చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరైనా వేటాడి చంపేశారా? లేకుంటే పొలాల్లో విషగుళికల నీళ్లు తాగి చనిపోయాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో అటవీఅధికారులు ఇందుకు సంబంధించిన వివరాలు సేకరించారు.
ఇదీ చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి