ETV Bharat / jagte-raho

అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష

author img

By

Published : Jan 6, 2021, 7:33 PM IST

Updated : Jan 6, 2021, 9:38 PM IST

అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష
అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష

19:31 January 06

అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించిన ఓ సెక్యూరిటీ గార్డ్​కు హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ సెషన్స్ కోర్టు కఠిన శిక్ష విధించింది. అబిడ్స్ చాపెల్ రోడ్​లో సుజాత స్కూల్​లో ఉత్తరప్రదేశ్ అలహాబాద్​కు చెందిన కమల్ భాన్ (33) సెక్యూరిటీ గార్డ్​గా పని చేసేవాడు. 

2017లో అదే స్కూల్​లో చదువుతున్న ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని ... నిందితుడి కమల్ భాన్​ను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ కేసు విచారణ ముగియటంతో... నాంపల్లి స్పెషల్ సెషన్స్ కోర్టు తీర్పును వెల్లడించింది. దోషిగా తేలిన కమల్​ భాన్​కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించింది. 

ఇదీ చదవండి: అపహరణకు గురైన మూడు నెలల చిన్నారి... కథ సుఖాంతం

Last Updated : Jan 6, 2021, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.