ETV Bharat / jagte-raho

పేకాట స్థావరాలపై దాడులు.. 21 మందిపై కేసు నమోదు

author img

By

Published : Feb 7, 2021, 11:51 AM IST

కుమురం భీం జిల్లా పెంచికల్​పేట మండల కేంద్రంలోని పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. 21మందిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి రూ.94 వేల నగదు, 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Attacks on a poker base in Komaram Bheem district 21 cases registered
పేకాట స్థావరంపై దాడి.. 21 మందిపై కేసు నమోదు

కుమురం భీం జిల్లా పెంచికల్పే​ట మండల కేంద్రంలో పేకాట స్థావరాలపై టాస్క్​ ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ, రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు... దాడులు నిర్వహించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.

ఈ దాడుల్లో 17మంది పట్టుపడగా... మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం 21 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.94 వేల నగదు, 15 ద్విచక్ర వాహనాలు, 14 చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ఖమ్మం హత్యోదంతం : ప్రియురాలిపై మోజుతోనే హత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.