ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతంతో మహిళ మృతి

author img

By

Published : Jan 19, 2021, 11:37 AM IST

కరెంట్​ తీగకు చేయి తగిలి.. విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన శాలిగౌరారం మండలంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

A woman died of electrocution in shakigouraram nalgonda district
విద్యుదాఘాతంతో మహిళ మృతి

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం చిత్తలూరులో​ భాగ్యలక్ష్మీ (28) అనే మహిళ విద్యుదాఘాతంతో మృతిచెందింది. ఇంట్లో పనిచేస్తున్న క్రమంలో అనుకోకుండా విద్యుత్​ వైరును పట్టుకోగా.. షాక్​ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

రోజూ మాదిరిగానే వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన భాగ్యలక్ష్మీ.. వంట సామగ్రిని సరిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతురాలికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు.

ఇదీ చదవండి: ఉరివేసుకొని ఎస్సై ఆత్మహత్య... కారణం అదేనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.