ETV Bharat / jagte-raho

మణికట్టు నరం కోసి... కోస్గిలో వ్యక్తి దారుణ హత్య!

author img

By

Published : Dec 18, 2020, 12:13 PM IST

మానవత విలువలు రోజురోజుకూ మంటగలుస్తున్నాయి. మనిషి ప్రాణాలంటే లెక్క లేకుండా పోతోంది. మృగాల కన్నా కిరాతంగా తోటి మనుషులే చంపుతున్నారు. నారాయణపేట జిల్లాలో ఓ వ్యక్తిని దుండగులు అతి కిరాతంగా హతమార్చారు. వ్యక్తి కాళ్లు కట్టేసి... మణికట్టు నరం కోసి కర్కశంగా చంపేశారు. అత్తింటి వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని మృతుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

a-man-very-cruel-murdered-at-kosgi-in-narayanpet-district
మణికట్టు నరం కోసి... కోస్గిలో వ్యక్తి దారుణ హత్య!

నారాయణపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోస్గి పురపాలికలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. కోస్గి బస్సు డిపో సమీపంలో వ్యక్తి కాళ్లు కట్టివేసి... మణికట్టు నరం కోసి దుండగులు అతి కిరాతంగా హతమార్చారు.

మృతుడు కొడంగల్ మండలం పరసాపూర్ వాసి అంజిలప్పగా పోలీసులు గుర్తించారు. అంజిలప్పను అత్తింటి వారే చంపి ఉంటారని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: 2020 రౌండప్​: ట్రాఫిక్​ జరిమానాల్లో ఇది ఆల్​టైం రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.