ETV Bharat / jagte-raho

తీగలాగితే డొంక కదిలింది.. గంజాయి పట్టుబడింది!

author img

By

Published : Sep 5, 2020, 2:27 PM IST

329 kgs ganja seized by excise police in hyderabad
329 కిలోల గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్​ పోలీసులు

ప్రైవేటు ట్రాన్స్​పోర్ట్ ఏజెన్సీల ద్వారా తప్పుడు పత్రాలతో గంజాయిని విశాఖ నుంచి గుర్గావ్​కు తరలిస్తుండగా హైదరాబాద్​లో ఎక్సైజ్​ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గరు నిందితులను అరెస్ట్ చేసి.. వారి నుంచి నాలుగు ఫోన్లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్​లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. బోయినపల్లిలో ఓ వ్యక్తి గంజాయి తరలిస్తున్నాడనే సమాచారంతో అతడిని పట్టుకోగా ఆ వ్యక్తి వద్ద 2 కిలోల గంజాయి లభ్యమైంది. అతడిని అదువులోకి తీసుకుని విచారించారు. మూడు ట్రాన్స్​పోర్ట్​ ఏజెన్సీల ద్వారా తప్పుడు పత్రాలు చూపించి విశాఖ నుంచి గుర్గావ్​కు గంజాయి తరలిస్తున్నట్లు చెప్పాడు.

ట్రాన్స్​పోర్ట్​ ఏజెన్సీల వద్దకు వెళ్లి విచారించగా 327 కిలోల గంజాయి లభ్యమైనట్లు మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణేశ్​ వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి నాలుగు ఫోన్లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ట్రాన్స్​పోర్ట్​ ఏజేన్సీల వారు సామగ్రిని తరలిస్తున్నప్పుడు పరిశీలించాకే తరలించాలని సూపరింటెండెంట్ చెప్పారు.

ఇదీ చూడండి: 'సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.