ETV Bharat / international

చర్చిలో కాల్పుల మోత.. పిల్లలు సహా 50 మంది మృతి!

author img

By

Published : Jun 5, 2022, 9:51 PM IST

Updated : Jun 6, 2022, 5:47 AM IST

Shooting At Church
Shooting At Church

shooting at church in nigeria: నైజీరియా ఓండోలోని సెయింట్​ ఫ్రాన్సిస్​ క్యాథలిక్​ చర్చిపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో మరణించి ఉంటారని స్థానిక శాసనసభ్యుడు చెప్పారు.

shooting at church in nigeria: నైజీరియాలోని నైరుతి ప్రాంతం ఓండోలోని ఓ చర్చిపై ఆదివారం ఓ దుండగుడు దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న భక్తులపై కాల్పులకు తెగబడ్డాడు. బాంబులు విసరటం వల్ల పలువురు చిన్నారులు సహా 50 మంది వరకు మరణించి ఉంటారని స్థానిక శాసనసభ్యుడు ఒకరు చెప్పారు.

ఓండో రాష్ట్రంలోని సెయింట్​ ఫ్రాన్సిస్​ క్యాథలిక్​ చర్చ్​లో ఆదివారం ప్రార్థనలు చేస్తుండగా దుండగుడు ప్రవేశించి దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురు పిల్లలు మరణించారని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నైజీరియా ఇస్లాం ఉగ్రవాదంతో బాధపడుతుండగా.. దేశంలో శాంతియుత రాష్ట్రంగా ఓండో ప్రసిద్ధి చెందింది.

ఇదీ చదవండి: మళ్లీ కాల్పుల మోత.. నలుగురు మృతి.. గ్రాడ్యుయేషన్​ పార్టీల్లో గ్యాంగ్​​ వార్​!

Last Updated :Jun 6, 2022, 5:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.