ETV Bharat / international

వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా.. 17 మంది మృతి

author img

By

Published : Jul 25, 2022, 9:27 AM IST

bahamas boat accident
బహమాస్ పడవ ప్రమాదం

Bahamas boat accident: వలసదారులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందిని భద్రతా బలగాలు రక్షించాయి. ఈ ఘటన బహమాస్​లో జరిగింది.

Bahamas boat accident: హైతీ వలసదారులతో ప్రయాణిస్తున్న బోటు బహమాస్​ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 17మంది మరణించారు. సముద్రం నుంచి బహమియన్ భద్రతా దళాలు 17 మృతదేహాలను వెలికితీశాయి. బోటులో ఉన్న 25 మందిని రక్షించినట్లు బహమాస్​ అధికారులు తెలిపారు. న్యూ ప్రొవిడెన్స్ నుంచి ఏడు మైళ్ల దూరంలో ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. మృతుల్లో 15 మంది మహిళలు, ఒక పురుషుడు, ఒక శిశువు ఉన్నారని పేర్కొన్నారు. బోటు ప్రమాదం నుంచి బయటపడిన వారిని ఆసుపత్రికి అధికారులు తరలించారు.

''ట్విన్-ఇంజిన్ స్పీడ్ బోట్ బహమాస్ నుంచి 60 మంది వలసదారులతో బయలుదేరి ప్రమాదానికి గురైంది. వలసదారులను అక్రమంగా తరలిస్తున్న వారిపై దర్యాప్తు చేస్తాం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నా.''

-ఫిలిప్ బ్రేవ్, బహమాస్ ప్రధాన మంత్రి

హైతీలో ఆర్థిక, రాజకీయపరమైన అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర దేశాలకు ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. సురక్షితమైన జీవితాన్ని వెతుక్కుంటూ 11 మిలియన్ల కంటే ఎక్కువ మంది దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది మేలో వలసదారుల బోటు మునిగి 11 మంది మరణించారు. మరో 38 మందిని అధికారులు రక్షించారు.

ఇవీ చదవండి: అమెరికాలో అరుదైన కేసు.. ఒకే వ్యక్తికి కరోనా, మంకీపాక్స్!

ప్రధాని రేసులో వెనుకంజ.. అంగీకరించిన రిషి.. 'అయినా తగ్గేదేలే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.