ETV Bharat / international

ఈయూతో రేపు బ్రిటన్ 'బ్రెగ్జిట్' భేటీ

author img

By

Published : Oct 2, 2020, 7:13 PM IST

బ్రెగ్జిట్ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది చివరినాటికి.. ఈయూతో బ్రిటన్​ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. ఈ గడువు సమీపిస్తున్న తరుణంలో శనివారం బ్రిటన్​ ప్రధాని, ఈయూ అధ్యక్షుడు సమావేశం కానున్నారు. ఇరు వర్గాలు ఒప్పందానికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

UK and EU chiefs to discus Brexit, free trade talks Saturday
బ్రెగ్జిట్​: ఈయూ అధ్యక్షుడితో బ్రిటన్​ ప్రధాని భేటి రేపే

బ్రిటన్​ ప్రధాని బోరిన్​ జాన్సన్​.. ఐరోపా సమాఖ్య(ఈయూ) అధ్యక్షుడు ఉర్సులా వాన్​ డెర్​ లియెన్​తో శనివారం సమావేశం కానున్నారు. ఈ మేరకు బ్రెగ్జిట్​ అనంతర స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై తదుపరి చర్యలను చర్చించనున్నట్టు తెలుస్తోంది.

బ్రెగ్జిట్​ గడువు ఈ ఏడాది చివర్లో ముగుస్తుండటం వల్ల.. ఇరువర్గాలు చర్చలకు సన్నద్ధమైనట్టు సమాచారం. ఈ మేరకు ఈయూతో వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో చర్చించనుంది బ్రిటన్​. గత జనవరిలో ఈయూ నుంచి వైదొలగిన యూకే.. వాణిజ్యం, సరిహద్దు అంశాల్లో​ స్వతంత్ర దేశంగా ఉంటోంది.

అక్టోబర్​ 15న జరిగే ఈయూ శిఖరాగ్ర సమావేశం నాటికి ఒప్పందం కుదరకపోతే.. చర్చలకు దూరంగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు జాన్సన్​.

ఇదీ చదవండి: బ్రెగ్జిట్​ ఒప్పందానికి బ్రిటన్​ తూట్లు- ఈయూ నోటీసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.