ETV Bharat / international

'డబ్ల్యూహెచ్​ఓ బలోపేతానికి జీ20 దేశాల అంగీకారం'

author img

By

Published : Oct 31, 2021, 10:48 PM IST

కొవిడ్ టీకాలకు అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవతం చేయడం కోసం డబ్ల్యూహెచ్​ఓను బలోపేతం చేయాలని జీ20 దేశాలు(G20 Summit 2021) నిర్ణయించాయి. డబ్ల్యూహెచ్​ఓ గుర్తించిన టీకాలను పరస్పరం అంగీకరించాలని తీర్మానించాయి. ఈ మేరకు జీ20 సదస్సు భారత ప్రతినిధి పీయూష్​ గోయల్ తెలిపారు.

G20 Summit 2021
జీ20 సదస్సు

కొవిడ్​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి తెలిపే ప్రక్రియనును వేగవంతం చేయడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థను(డబ్ల్యూహెచ్​ఓ) బలోపేతం చేయాలని ప్రధాని మోదీ సహా జీ20 దేశాల(G20 Summit 2021) నేతలు అంగీకరించారు. ఈ మేరకు జీ20 సదస్సు(G20 Summit 2021) భారత ప్రతినిధి పీయూష్ గోయల్ ఆదివారం తెలిపారు.

జీ20 సదస్సులో పాల్గొన్న సభ్య దేశాల నేతలు 'రోమ్ తీర్మానం' ఆమోదించారని గోయల్ తెలిపారు. కొవిడ్ పోరాటంలో ప్రజలందరికీ రోగ నిరోధకతను పెంచడమే కీలకం అనే సందేశమిచ్చారని చెప్పారు. డబ్ల్యూహెచ్​ఓ గుర్తించిన టీకాలను పరస్పరం అంగీకరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

"కొవిడ్ టీకాలకు డబ్ల్యూహెచ్​ఓ అత్యవసర వినియోగం ఆమోదం తెలిపే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సహాయపడాలని జీ20 దేశాల నేతలు అంగీకరించారు. డబ్ల్యూహెచ్​ఓ బలోపేతమైతే.. టీకాల గుర్తింపు ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని పేర్కొన్నారు."

-పీయూష్ గోయల్​, జీ20 సదస్సు భారత ప్రతినిధి

వచ్చే ఏడాది చివరి నాటికి 500 కోట్ల కొవిడ్​ టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు భారత్​ సిద్ధంగా ఉందని జీ20 సదస్సులో(G20 Summit 2021) పాల్గొన్న ప్రధాని మోదీ శనివారం తెలిపారు. తద్వారా కరోనాపై పోరులో ప్రపంచానికి మరింత బాసటగా నిలుస్తుందని చెప్పారు. అయితే.. భారత్​లో తయారైన టీకాలను డబ్ల్యూహెచ్​ఓ సాధ్యమైనంత త్వరగా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సుస్థిరమైన వినియోగం, బాధ్యతాయుతమైన ఉత్పత్తి విధానాలపై జీ20 సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో ప్రధాని మోదీ సుస్థిర జీవన శైలి మంత్రం ప్రతిబింబించిందని గోయల్ పేర్కొన్నారు. జీ20 సదస్సులో చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధిపై భారత్ తన చర్చల్లో ప్రస్తావించిందని చెప్పారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.