ETV Bharat / international

'చాలా దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించి ఉండవచ్చు'

author img

By

Published : Dec 15, 2021, 5:30 AM IST

Updated : Dec 15, 2021, 6:28 AM IST

WHO Omicron
డబ్ల్యూహెచ్​ఓ ఒమిక్రాన్​

WHO Omicron: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. అయితే.. మిగతా దేశాల్లోనూ ఈ వేరియంట్​ కేసులు ఉండవచ్చని చెప్పింది. మరోవైపు.. చైనాలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది.

WHO Omicron: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​.. ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్​​ 70కి పైగా దేశాల్లో వెలుగు చూసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోనూ ఇప్పటికే ఈ వేరియంట్ వ్యాపించి ఉండవచ్చని చెప్పింది. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా తెలిపింది.

"77 దేశాల్లో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మిగతా దేశాల్లో ఈ వేరియంట్​ కేసులు ఇంకా నిర్ధరణ కాకపోయినప్పటికీ.. అక్కడ కూడా ఈ వేరియంట్​ కేసులు ఉండవచ్చు. గతంలో ఏ వేరియంట్​ లేనంత ఎక్కువ వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తోంది."

-ప్రపంచ ఆరోగ్య సంస్థ

Omicron countries: "చాలా మంది ఒమిక్రాన్‌ను తేలికపాటిదిగా భావిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ కలిగించే​ ప్రమాదంపై తక్కువగానే అంచనా వేశాం. ఒమిక్రాన్​తో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న కేసులు సంసిద్ధంగా లేని ఆరోగ్య వ్యవస్థపై పెనుముప్పును తేగలవు" అని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

ఇదీ చూడండి: ఇన్‌ఫెక్షన్‌కు టీకా తోడైతే.. యాంటీబాడీలు పుంజుకున్నట్టేo

booster dose omicron: ప్రజలంతా కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డబ్ల్యాహెచ్​ఓ కోరింది. టీకా వేసుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని తెలిపింది. బూస్టర్​ డోసు వల్ల ఒమిక్రాన్​ వేరియంట్​ను సమర్థంగా ఎదుర్కోవడంపై ఆధారాలు లేకపోయినా.. చాలా దేశాలు బూస్టర్ డోసు పంపిణీ చేస్తున్నాయని డబ్యూహెచ్​ఓ పేర్కొంది.

అంతకుముందు... ఒమిక్రాన్ వేరియంట్​​తో ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుందని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. అదే సమయంలో మరణాలు సంఖ్య కూడా పెరుగుతుందని హెచ్చరించింది.

చైనాలో రెండో కేసు

China omicron cases: చైనాను ఒమిక్రాన్ వేరియంట్​ కలవరానికి గురి చేస్తోంది. ఆ దేశంలో ​ రెండో కేసు మంగళవారం వెలుగు చూసింది. 67 ఏళ్ల ఓ వ్యక్తికి ఈ వేరియంట్ సోకినట్లు తేలిందని చైనా అధికారిక మీడియా తెలిపింది.

విదేశాల నుంచి నవంబరు 27న వచ్చిన సదరు వ్యక్తి.. రెండు వారాలపాటు క్వారంటైన్​లో ఉన్నారు. అప్పుడు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్​గానే తేలింది. శనివారం ఆయన గ్వాంగ్జౌ నగరానికి చేరుకున్నాడు. అక్కడ మరో వారంపాటు ఆయన క్వారంటైన్​లో ఉన్నారు. సోమవారం ఆయన మరోసారి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్​గా తేలింది. తర్వాత చేసిన జన్యుపరీక్షల్లో ఆయనకు ఒమిక్రాన్ వేరియంట్​ సోకినట్లు నిర్ధరణ అయిందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: బ్రిటన్‌లో తొలి 'ఒమిక్రాన్‌' మరణం- పాక్​లో మొదటి కేసు

Polish teenager omicron: యూరప్​ నుంచి ఈ నెల ప్రారంభంలో చైనాకు వచ్చిన ఓ టీనేజర్​కు ఒమిక్రాన్ వేరియంట్​ తొలి కేసు వెలుగు చూసిందని చైనా ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం తెలిపారు. అయితే... సదరు టీనేజర్ తమ దేశానికి చెందిన వ్యక్తి అని పోలాండ్ ఆరోగ్య శాఖ మంగళవారం ధ్రువీకరించింది. ఒమిక్రాన్ నిర్ధరణ అయిన ఆ టీనేజర్ వర్సా నుంచి గతవారం తన తల్లితో కలిసి చైనాకు వెళ్లిందని చెప్పింది. ఆమె ​ప్రస్తుతం ఆస్పత్రిలో ఐసోలేషన్​లో ఉందని పోలాండ్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొన్నారు.

డిసెంబరు 6న వర్సా నుంచి బయలుదేరే ముందు నిర్వహించిన పరీక్షల్లో టీనేజర్​కు కరోనా నెగెటివ్​గానే తేలిందని సదరు అధికారి తెలిపారు. చైనాకు చేరిన తర్వాత ఆమెకు కరోనా సోకగా.. డిసెంబరు 13న రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో ఒమిక్రాన్ నిర్ధరణ అయిందని చెప్పారు. ఒమిక్రాన్ సోకిన ఆ టీనేజర్ ప్రస్తుతం చైనాలోని టింజియాన్ నగరంలో ఉన్నారని చైనా గ్లోబల్ టైమ్స్​ పత్రిక తన కథనంలో తెలిపింది.

ఇదీ చూడండి: దక్షిణ కొరియాపై కరోనా పంజా- రోగులతో ఆస్పత్రులు ఫుల్​

Last Updated :Dec 15, 2021, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.