ETV Bharat / international

Afghan news: మసీదులో బాంబు దాడి.. ఐదుగురు మృతి

author img

By

Published : Oct 3, 2021, 5:23 PM IST

Updated : Oct 3, 2021, 10:16 PM IST

AFGHAN-BLAST
మసీదులో బాంబు దాడి

17:19 October 03

Afghan news: మసీదులో బాంబు దాడి.. ఐదుగురు మృతి

అఫ్గానిస్థాన్​ కాబూల్​లోని (Afghan news) ఓ మసీదుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు చనిపోయినట్లు తాలిబన్ల(Afghanistan Taliban) అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. 

తాలిబన్​ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్​ తల్లి స్మారక కార్యక్రమం జరుగుతున్న క్రమంలోనే.. ఈద్గా మసీదు లక్ష్యంగా బాంబు దాడి జరిగిందని తెలిపారు. అయితే.. మసీదు బయట ఉన్న పౌరులే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ముగ్గురు అనుమానితుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. 

ఈ ఘటనకు ఇప్పటివరకు ఎవరూ బాధ్యత వహించలేదు. అయితే.. ఆగస్టులో తాలిబన్లు అఫ్గానిస్థాన్​ను (Afghan news) ఆక్రమించుకున్నప్పటి నుంచి ఐసిస్​(Afghanistan ISIS) ఉగ్రవాదుల దాడులు ఎక్కువయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రెండు తీవ్రవాద ముఠాల మధ్య సంఘర్షణ తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఐసిస్​.. తూర్పు నంగర్హర్​లో తమ ఉనికిని క్రమంగా విస్తరించుకుంటోంది. జలాలాబాద్​ సహా కాబూల్​లో ఎన్నో దాడులు జరిపి చాలా మందిని పొట్టనపెట్టుకున్నారు.  

ఇవీ చూడండి: ISIS Attack in India: భారత్​పై ఐసిస్ గురి- ఎన్ఐఏ హెచ్చరిక

తాలిబన్ల​ గుండెల్లో 'ఇస్లామిక్​ స్టేట్​' గుబులు!

Last Updated :Oct 3, 2021, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.