ETV Bharat / international

మసీదు లక్ష్యంగా మరో బాంబు పేలుడు.. 47 మంది మృతి

author img

By

Published : Oct 15, 2021, 3:13 PM IST

Updated : Oct 16, 2021, 3:56 PM IST

blast
అఫ్గాన్​ పేలుడు

15:07 October 15

మసీదు లక్ష్యంగా.. అఫ్గాన్​లో మరో పేలుడు

అఫ్గానిస్థాన్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కాందహార్‌లో జరిగిన ఈ ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మరో 70 మందికిపైగా గాయాలయ్యాయి. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.

ఈ బాంబు దాడి తమ పనేనని ఇస్లామిక్​ స్టేట్​ గ్రూప్​(ఐసిస్​) ప్రకటించింది. 

షియా మైనారిటీలే లక్ష్యంగా ఐసిస్​ తరచూ దాడులకు పాల్పడుతోంది. గతవారం.. కుందుజ్‌ షియా మసీదులో ఆ సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో 46 మంది మరణించారు. 

Last Updated : Oct 16, 2021, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.