ETV Bharat / international

కొవిడ్​పై బ్రిక్స్​ ఉన్నతాధికారుల విస్తృత చర్చలు

author img

By

Published : May 29, 2021, 9:12 AM IST

BRICS
బ్రిక్స్​

బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం జూన్​ 1న జరగనున్న క్రమంలో.. కూటమిలోని ఉన్నతాధికారులు విస్తృత చర్చలు జరిపారు. సన్నాహక చర్యలపై సమీక్షించారు. కొవిడ్​-19 నేపథ్యంలో భద్రత, ఆర్థికవ్యవస్థ.. తదితర అంశాలపై చర్చించారు.

జూన్ 1న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం నేపథ్యంలో సన్నాహక చర్యలపై బ్రిక్స్ కూటమిలోని ఉన్నతాధికారులు విస్తృత చర్చలు జరిపారు. ఈ సమావేశాలు మే 25 నుంచి 28 వరకు జరిగాయి. కరోనా వేళ భద్రత, ఆర్థికవ్యవస్థ.. తదితర వాటిపైనే సమావేశం జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. జూన్​1న వర్చువల్​గా జరగబోయే బ్రిక్స్​ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

బ్రిక్స్​ కూటమిలో బ్రెజిల్​, రష్యా, భారత్​, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్య దేశాలుగా ఉన్నాయి.

ఇదీ చదవండి : అమెరికా రక్షణ మంత్రితో జై శంకర్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.