kabul airport blast: కాబుల్​ 'బాంబర్​'.. దిల్లీలో భారీ పేలుళ్లకు స్కెచ్​!

author img

By

Published : Sep 19, 2021, 12:26 PM IST

Kabul airport bomber rented Delhi flat

గత నెల కాబుల్​ విమానాశ్రయం వద్ద జరిగిన ఆత్మహుతి దాడి(kabul airport bomb blast).. ప్రపంచ దేశాలను ఉల్లిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఘటనకు తమదే బాధ్యత అని ఐసిస్​-కే ప్రకటించింది. అయితే ఆ ఆత్మహుతి దాడికి(kabul airport blast) పాల్పడిన వ్యక్తి ఐదేళ్ల ముందు వరకు భారత్​లోనే ఉన్నాడు. కశ్మీర్​పై ప్రతికార దాడుల కోసం దిల్లీలోని రద్దీ ప్రాంతాల్లో నిఘా పెట్టాడు. దాడులకు ప్రణాళికలు రచిస్తున్న సమయంలో పోలీసులకు చిక్కాడు. ఈ విషయాన్ని ఇస్లామిక్​ స్టేట్​కు చెందిన భారత విభాగం.. తాజాగా తన మేగజైన్​లో పేర్కొంది.

కాబుల్​ విమానాశ్రయం వద్ద గత నెల జరిగిన ఆత్మహుతి దాడిపై(kabul airport bomb blast).. ఇస్లామిక్​ స్టేట్​కు చెందిన భారత విభాగం "వలియత్​ హింద్​" సంచలన వివరాలు బయటపెట్టింది. ఆత్మహుతి దాడికి పాల్పడిన వ్యక్తిని ఐదేళ్ల ముందు దిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్టు వెల్లడించింది. 'కశ్మీర్​' కోసం భారీ ప్రతికార దాడులకు ప్రణాళికలు రచిస్తుండగా అతడు పోలీసులకు చిక్కాడని.. ఆ తర్వాత అధికారులు అతడిని అఫ్గాన్​ సైన్యానికి అప్పజెప్పారని.. తన మేగజైన్​ "సావత్​ అల్-​ హింద్​"లో రాసుకొచ్చింది.

ఆగస్టులో.. తాలిబన్ల ఆక్రమణతో అఫ్గాన్​ సంక్షోభం ముదిరింది. దేశాన్ని వీడేందుకు ప్రజలు భారీ సంఖ్యలో కాబుల్​ విమానాశ్రయానికి తరలివెళ్లారు. దీంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. ఆగస్టు 26న అదును చూసుకుని.. అబ్బే గేట్​ వద్ద ఆత్మహుతి దాడికి పాల్పడింది ఐసిస్-​కే(ఖొరసన్​)(isis khorasan). ఈ ఘటనలో 250మందికిపైగా మరణించారు. వీరిలో 13మంది అమెరికా సైనికులు, తాలిబన్​ ఫైటర్లు కూడా ఉన్నారు.

ఇదీ చూడండి:- ISIS khorasan: 'ఐసిస్​-కే'కు రూ.వేల కోట్ల నిధులు ఎలా వచ్చాయ్​?

మేగజైన్ కథనం​ ప్రకారం...

అఫ్గాన్​లోని లగోర్​ రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల అబ్దుల్​ రహ్మాన్​ అల్​-లగోరి.. ఆత్మహుతి దాడికి(kabul airport blast) పాల్పడ్డాడు. అతడు 25ఏళ్ల వయస్సులో భారత్​కు వచ్చాడు. ఇంజినీరింగ్​ కోసం దిల్లీ-ఫరిదాబాద్​ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కాలేజీలో పేరు నమోదు చేసుకున్నాడు. వాస్తవానికి.. రహ్మాన్​ భారత్​కు వచ్చింది.. కశ్మీర్​ విషయంలో భారత్​పై ప్రతికారం తీర్చుకోవడం కోసమే. దిల్లీకి వచ్చిన కొద్ది రోజులకే వేట మొదలుపెట్టాడు రహ్మాన్​. రద్దీ ప్రాంతాలను జల్లెడ పట్టి.. ఎప్పటికప్పుడు నిఘా పెట్టాడు. ఆత్మహుతి దాడి కోసం ప్రణాళికలు రచించాడు.

రహ్మాన్​ను పట్టుకునేందుకు 'రా' రంగంలోకి దిగింది. 18నెలల పాటు అతడిపై నిఘా పెట్టింది. ఓ 'వ్యక్తి'ని బరిలోకి దింపి.. రహ్మాన్​తో దగ్గరయ్యేలా చేసింది. ఆ వ్యక్తిపై నమ్మకంతో రహ్మన్​.. దిల్లీలోని లజ్​పత్​ నగర్​లో ఓ అపార్ట్​మెంట్​ అద్దెకు తీసుకున్నాడు. అక్కడే 2017 సెప్టెంబర్​లో పోలీసులు రహ్మాన్​ను పట్టుకున్నారు.

ఆ తర్వాత రహ్మాన్​ను అఫ్గానిస్థాన్​లో అమెరికా సైన్యం తన కస్టడీలోకి తీసుకుంది. 2021 ఆగస్టులో అఫ్గాన్​ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశ జైళ్లల్లో ఉన్న నేరస్థులు, ఉగ్రవాదులను తాలిబన్లు ఒక్కసారిగా విడిచిపెట్టారు. అలా బయటకొచ్చిన రహ్మాన్​.. వెంటనే తన 'సోదరుల'తో కలిసి ఐఎసిస్​-కే ప్రాబల్యమున్న ప్రాంతానికి వెళ్లాడు(isis khorasan province). అక్కడే కాబుల్​ ఆత్మహుతి దాడి కోసం తన పేరు నమోదు చేసుకున్నాడు.(kabul airport attack)

ఇదీ చూడండి:- ISIS Kabul Attack: ఏంటీ ఐసిస్​-కే? తాలిబన్లకు శత్రువా?

ఐసిస్​-కేలో భారతీయులు!

కశ్మీర్​పై ఎక్కువ దృష్టి సారించే ఐసిస్​-కే.. భారత్​ నుంచే ఎక్కువ నియామకాలు చేసుకుంటుంది. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలో వారిని తీసుకుని ఫైటర్లుగా మారుస్తుంది.(isis kerala connection)

2020 మార్చి 25న, కాబుల్​లోని ధరమ్​శాలా గురుద్వారాలో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 28మంది మరణించారు. కశ్మీర్​లో ముస్లింల అణచివేతకు ప్రతికారంగా దాడి చేసినట్టు ఐసిస్​-కే ప్రకటించింది.​ ఆ దాడికి పాల్పడింది కేరళకు చెందిన సాజిద్​. 2015 మార్చిలో ముంబయి నుంచి దుబాయ్​ వెళ్లిన సాజిద్​.. ఇస్లామిక్​ స్టేట్​తో కలిసిపోయాడు.

-- సంజీవ్​ కే బారువా, సీనియర్​ జర్నలిస్ట్​.

ఇదీ చూడండి:- ISIS Kabul Attack: 'ఐసిస్​-కే'లో 14 మంది కేరళవాసులు- తాలిబన్ల దయతో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.