ETV Bharat / international

ఐరాసలో కశ్మీర్​పై ఇమ్రాన్​ పాతపాట- భారత్​ వాకౌట్

author img

By

Published : Sep 26, 2020, 8:06 AM IST

Indian delegate at the UN General Assembly Hall walked out when Pakistan PM began his speech
ఐరాస సమావేశం నుంచి వాక్​ఔట్​ చేసిన భారత్​!

ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్ముకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన పాక్‌కు భారత్‌ గట్టి హెచ్చరికలు జారీచేసింది. పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ ప్రసంగం సమయంలో భారత ప్రతినిధి హాల్​ నుంచి వాకౌట్ చేసి నిరసన తెలిపారు. పాకిస్థాన్‌ పదేపదే విద్వేష ప్రచారాన్ని కొనసాగిస్తున్నదని ఐరాసలో భారత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి మండిపడ్డారు.

ఐక్యరాజ్యసమితి 75వ సర్వసభ్య సమావేశంలో కశ్మీర్​ అంశంపై పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ వ్యాఖ్యలపై భారత్​ గట్టిగా స్పందించింది. ఇమ్రాన్​ ప్రకటనలకు ప్రతిస్పందన ఇచ్చేందుకు 'రైట్​ టూ రిప్లై' అవకాశాన్ని ఇవ్వాలని ఐరాసను కోరింది.

ఇమ్రాన్ ఖాన్ ముందే రికార్డ్ చేసిన ప్రకటన చేస్తున్న సమయంలో భారత ప్రతినిధి మిజిటో వినిటో సమావేశ హాల్​ నుంచి వాకౌట్ చేసి.. ఇండియా వైఖరిని స్పష్టం చేశారు.

ఐరాస సమావేశం నుంచి వాక్​ఔట్​ చేసిన భారత్​!

"భారత్​లో జమ్ముకశ్మీర్​ కేంద్రపాలిత ప్రాంత అంతర్భాగం. విడదీయలేని అంగం. జమ్ముకశ్మీర్​లో తీసుకొచ్చిన చట్టాలు, నిబంధనలు పూర్తిగా భారత్​ అంతర్గత వ్యవహారం. కశ్మీర్​కు సంబంధించి ఏదైనా వివాదం ఉందంటే.. అది పాక్​ ఆక్రమణలో ఉన్న కశ్మీర్​ గురించే. కశ్మీర్​లో​ పాక్​ అక్రమ ఆక్రమించుకున్న అన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలి" అని భారత్ ఘాటుగా బదులిచ్చింది.

ఆర్టికల్ 370 రద్దుపై ఇమ్రాన్​..

అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ తన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు.

"పాకిస్థాన్​ ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంది. ఈ దిశగా 2019 ఆగస్టు 5న భారత్ తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలి. జమ్ముకశ్మీర్​లో సైనిక మోహరింపు, మానవ హక్కుల ఉల్లంఘనలకు స్వస్తి పలకాలి."

- ఇమ్రాన్ ఖాన్​, పాక్ ప్రధాని

అన్నీ అబద్ధాలే..

పాకిస్థాన్‌ పదేపదే విద్వేష ప్రచారాన్ని కొనసాగిస్తున్నదని ఐరాసలో భారత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి మండిపడ్డారు. ఇమ్రాన్‌ఖాన్‌ జమ్ముకశ్మీర్‌పై చేసిన ప్రసంగం పూర్తిగా అబద్ధాలు, అసత్యాలతో కూడుకున్నదని మండిపడ్డారు.

ఇదీ చూడండి: నిరసనకారుడి తలపైకి సైకిల్​ ఎక్కించిన పోలీస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.