ETV Bharat / international

'అంతర్జాతీయ వేదికల్లో భారత్​ది బాధ్యతాయుత పాత్ర'

author img

By

Published : Jul 6, 2020, 12:27 PM IST

India 'very responsible' player in global fora, can galvanise action as UNSC member: UN official
'అంతర్జాతీయ వేదికల్లో భారత్​ది బాధ్యతాయుతమైన పాత్ర'

అంతర్జాతీయ వేదికల్లో భారత దేశం బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోందని ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు ముహమ్మద్​-బాండే ప్రశంసించారు. ప్రపంచ దేశాలతో ఉన్న దృఢమైన సంబంధాలు నేపథ్యంలో ఐరాసకు భారత్​ అన్ని విధాలుగా సహాయపడగలదని పేర్కొన్నారు.

భారత్​పై ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు తిజ్జన్​ మహ్మద్​ బండే ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ వేదికల్లో భారత్​ ఎంతో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఐరాస భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ)లో తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న భారత్​.. వివిధ రంగాల అభివృద్ధికి కృషి చేయగలదని పేర్కొన్నారు.

"సాంకేతికత, ప్రజలు, వారి ఆలోచనల పరంగా.. ప్రపంచదేశాలకు భారత్​ ఎంతో ముఖ్యం. వివిధ అంతర్జాతీయ సంస్థల్లో శక్తిమంతమైన సభ్య దేశంగా భారత్​ కొనసాగుతోంది. ఆయా దేశాలు ఐరాస వేదికగా చర్చలు జరపడానికి, భద్రతా మండలి సభ్య దేశంగా భారత్​ కృషి చేయగలదు."

-- తిజ్జన్​ మహ్మద్ బండే, ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు.

ఐరాస భద్రతామండలిలోని 5 తాత్కాలిక సభ్యదేశాల కోసం జూన్​ 17న జరిగిన ఎన్నికల్లో భారత్​ ఘనవిజయం సాధించింది. రహస్య బ్యాలెట్​ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 192లో.. 184 ఓట్లు దక్కించుకుంది. భారత రెండేళ్ల పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది.

ఆసియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు భారత్​ గొప్పగా మద్దుతునిస్తోందని బండే పేర్కొన్నారు. యూఎన్​ఎస్​సీ సభ్య దేశంగా భారత్​పై ఎలాంటి అంచనాలున్నాయన్న ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. వ్యాక్సిన్​, చికిత్స వంటి వైద్య సదుపాయాలు అందరికీ చేరాలన్న ఐరాస లక్ష్యానికి భారత్​ ఎంతో సహాయం చేయగలదని అభిప్రాయపడ్డారు.

వ్యాక్సిన్​లు అందరికీ అందుబాటులో ఉంచాలన్న సాధారణ అసెంబ్లీ తీర్మానాన్ని సభ్యదేశాలు అంగీకరించాయని వెల్లడించారు మహ్మద్.

"అభివృద్ధి చేసిన అనంతరం వ్యాక్సిన్లను త్వరగా ఉత్పత్తి చేయగల దేశాలకు ఒక బాధ్యత ఉంటుంది. ఇది జరగడానికి నిధులు కావాలి. అనంతరం ఎవరికి వ్యాక్సిన్​ అందుబాటులో ఉండాలన్న విషయాన్ని నిర్ణయించడానికి ఓ వ్యవస్థను రూపొందిస్తాం. ఈ కరోనా సంక్షోభానికి ముందే.. వైద్య సదుపాయాలు అందుబాటులో లేక అనేక దేశాలు సతమతమయ్యాయి. ఈ పరిస్థితులను కరోనా వైరస్​ మరింత తీవ్రం చేసింది."

-- తిజ్జన్​ మహ్మద్ బండే, ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.