ETV Bharat / international

రష్యాపై మోదీ ప్రశంసల జల్లు- తాలిబన్లే కారణమా?

author img

By

Published : Sep 3, 2021, 3:59 PM IST

India-Russia friendship
రష్యాపై మోదీ ప్రశంసల జల్లు

ఈస్టర్న్​ ఎకనామిక్​ ఫోరమ్​(ఈఈఎఫ్​) ప్లీనరీ వేదికగా(eastern economic forum india) రష్యాపై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్​-రష్యా మధ్య స్నేహబంధాన్ని కొనియాడారు.

భారత్​-రష్యా మధ్య స్నేహబంధం కాల పరీక్షను తట్టుకొని నిలబడిందని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi on russia). కొవిడ్​-19 మహమ్మారి(Covid-19 pandamic) సమయంలో, టీకా పంపిణీలో(Corona vaccination) ఇరు దేశాల మధ్య సహకారం ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు.

వ్లాదివోస్టోక్​ వేదికగా జరుగుతున్న ఈస్టర్న్​ ఎకనామిక్​ ఫోరమ్ (ఈఈఎఫ్​) ప్లీనరీలో(eastern economic forum india) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు ప్రధాని మోదీ.

" ఈ సదస్సులో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. అధ్యక్షుడు​ పుతిన్​కు కృతజ్ఞతలు. భారత చరిత్రలో 'సంఘం' పదానికి సంగమం లేదా నదులు, ప్రజలు, ఆలోచనల కలయిక అనే ప్రత్యేక అర్థం ఉంది. నా ఆలోచన ప్రకారం వ్లాదివోస్టోక్​ నిజంగా యురేషియా, పసిఫిక్​కు ఒక సంగమం. రష్యా అభివృద్ధి కోసం అధ్యక్షుడు పుతిన్​ ఆలోచనలు, దూరదృష్టికి నా అభినందనలు. గగన్​యాన్​తో అంతరిక్ష పరిశోధనల్లో ఇరు దేశాలు భాగస్వాములయ్యాయి. అంతర్జాతీయ వ్యాణిజ్యం కోసం ఉత్తర సముద్ర మార్గాన్ని తెరిచేందుకు ఇరు దేశాలు కృషి చేశాయి.

భారత్​, రష్యా మధ్య ఉన్న స్నేహబంధం గొప్పది. ఇటీవల కొవిడ్​-19 సమయంలో అది నిరూపితమైంది. ప్రపంచ ఇంధన మార్కెట్​లో స్థిరత్వాన్ని తీసుకురావడంలో భారత్​, రష్యా సహాయపడతాయి. భారత్​లో అద్భుతమైన మేథాశక్తితో పాటు ఎన్నో మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇరు దేశాల అభివృద్ధికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

గవర్నర్లకు ఆహ్వానం..

రష్యన్ ఫార్​ ఈస్ట్​లోని 11 ప్రాంతాల గవర్నర్లు త్వరలోనే భారత్​లో పర్యటించాలని సదస్సు వేదికగా ఆహ్వానించారు ప్రధాని మోదీ. 2019లో రష్యాలోని వ్లాదివోస్టోక్​ నగరంలో జరిగిన ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు మోదీ. ఆ సమయంలో యాక్ట్​ ఈస్ట్​ పాలసీని ప్రకటించినట్లు చెప్పారు. అది రష్యాతో ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.

రష్యాపై ప్రశంసలకు కారణం అదేనా?

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించిన క్రమంలో వారికి రష్యా, చైనా మాత్రమే మద్దతు పలికాయి. మరోవైపు.. భారత వ్యతిరేక కార్యకలాపాలకు అఫ్గాన్​ కేంద్ర బిందువుగా మారే ప్రమాదం ఉందని మొదటి నుంచి కేంద్రం ఆందోళన చెందుతోంది. కశ్మీర్​ అంశంపై తాలిబన్ల తాజా ప్రకటన(Taliban on Kashmir) సైతం ఆందోళనను మరింత పెంచుతోంది. ఈ క్రమంలోనే రష్యాతో సన్నిహితంగా ఉంటే.. తాలిబన్ల సమస్యను పరిష్కరించవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రష్యాపై మోదీ ప్రశంసలు కురిపించడం, భారత పర్యటనకు గవర్నర్లను ఆహ్వానించటం ఇందులో భాగంగానే కనిపిస్తోంది.

ఇదీ చూడండి: Taliban on Kashmir: కశ్మీర్​పై మాట మార్చిన తాలిబన్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.