ETV Bharat / international

కాబుల్​లో వరుస పేలుళ్లు.. ముగ్గురు మృతి

author img

By

Published : Nov 2, 2021, 5:54 PM IST

వరుస బాంబు దాడులతో అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​ అట్టుడుకుతోంది. తాజాగా జాతీయ మిలిటరీ ఆస్పత్రి సమీపంలో రెండు చోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

kabul blast today
కాబుల్​ బాంబు దాడి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో వరుస బాంబు దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా జాతీయ మిలిటరీ ఆస్పత్రికి సమీపంలో రెండు చోట్ల బాంబు దాడులు జరిగినట్లు సమాచారం. ఈ పేలుళ్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 16మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులకు పాల్పడినట్లు.. తాలిబన్‌ అధికార ప్రతినిధి బిలాల్‌ కరిమీ తెలిపారు. వరుస బాంబు దాడుల నేపథ్యంలో ప్రజలు భయంతో.. కాబుల్‌ నుంచి వేరే ప్రాంతాలకు పరుగులు తీశారు.

అఫ్గాన్‌లో తాలిబన్‌లు అధికారం చేపట్టినప్పటి నుంచి.. ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌కు చెందిన తీవ్రవాదులు బాంబు దాడులకు పాల్పడుతున్నారు.

ఇదీ చూడండి:- అఫ్గాన్​ మసీదులో భారీ పేలుడు.. 46 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.