ETV Bharat / international

నది ఒడ్డున బస్సు బోల్తా- 10 మంది మృతి

author img

By

Published : May 30, 2021, 7:26 AM IST

పాక్​ ఆక్రమిత కశ్మీర్​(పీఓకే)లోని ముజఫరా​బాద్​లో ఘోర ప్రమాదం జరిగింది. 25 మందితో ప్రయాణిస్తున్న బస్సు.. నది ఒడ్డున లోయలో పడిన ఘటనలో 10 మంది మృతిచెందారు. మరో 15 మంది గాయాలపాలయ్యారు.

bus accident in pol muzaffarabad
బస్సు ప్రమాదం

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ముజఫరా​బాద్​లో విషాదం జరిగింది. 25 మందితో ప్రయాణిస్తున్న ఓ బస్సు అదుపుతప్పి నది ఒడ్డున లోయలో పడిన ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడ్డారు.

ముజఫరా​బాద్​కు 24 కి.మీ.ల దూరంలోని జమీనాబాద్​ గ్రామం వద్ద జీలమ్​ నది ఒడ్డున ముజఫరా​బాద్​-కోహాలా రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రావల్పిండి నుంచి చకోథికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు.

ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు.

ఇదీ చూడండి: బడి ప్రాంగణంలో 215 అస్థిపంజరాలు

ఇదీ చూడండి: అంతరిక్ష కేంద్రానికి సరకులతో చైనా వ్యోమనౌక పయనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.