ETV Bharat / international

'ఉగ్రవాద నిర్మూలన, శాంతి స్థాపనే ప్రధాన ఎజెండా'

author img

By

Published : Aug 2, 2021, 12:01 PM IST

TS Tirumurti
టీఎస్​ తిరుమూర్తి, ఐరాస భద్రతా మండలి

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష హోదాలో.. ఉగ్రవాద నిర్మూలన, సముద్ర తీర ప్రాంత భద్రత, శాంతి స్థాపనే ప్రధాన ఎజెండాగా పేర్కొంది భారత్​. ఐఎస్​ ఉగ్రవాదులపై ఐరాస సెక్రటరీ జనరల్​ నివేదికపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు పేర్కొంది.

ఇస్లామిక్​ స్టేట్​ (ఐఎస్​) ఉగ్రవాదులపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ నివేదికపై ప్రధానంగా దృష్టి సారించాలని భావిస్తున్నట్లు ​తెలిపింది భారత్​. అయితే.. ముందుగా సముద్ర తీర ప్రాంత భద్రతపై చర్చించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టిన క్రమంలో.. ఈ వాఖ్యలు చేశారు భారత శాశ్వత ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి.

" ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల తీరును లేవనెత్తటంలో ఎన్నడూ విఫలం కాలేదు. ముఖ్యంగా ఆఫ్రికాలో పెట్రేగిపోతున్న తీవ్రవాద అంశమే ఉదాహరణ. ఐఎస్​ఐఎల్​, ఐఎస్​ఐఎస్​ ఉగ్రముఠాలపై ఐరాస సెక్రటరీ జనరల్ నివేదికపై చర్చిస్తాం. ఈ విషయంపై ప్రధానంగా దృష్టి సారిస్తాం. సముద్ర తీర ప్రాంత భద్రతపై తొలిత చర్చించే అవకాశం ఉంది. మా విదేశీ విధానంలో సముద్ర తీర భద్రత అనేది తొలి ప్రాధాన్యమని మీకు తెలుసు. ఈ అశంపై భద్రతా మండలి సంపూర్ణ విధానం అవలంభించాల్సిన సరైన సమయం ఇదేనని నమ్ముతున్నాం. "

- టీఎస్​ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి.

శాంతి స్థాపనపై కీలక విషయాలు వెల్లడించారు తిరుమూర్తి. ' శాంతి పరిరక్షకుల భద్రతకు భరోసా కల్పించటంపై దృష్టి సారిస్తాం. ఆ దిశగా సాంకేతికతను ఉపయోగించుకుంటాం. అలగే.. వారిపై దాడులకు పాల్పడే వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావటానికి కృషి చేస్తాం. ముందు నుంచి ఈ విషయంలో మా వాదనలు గట్టిగా వినిపిస్తున్నాం. 'అని పేర్కొన్నారు.

భద్రతా మండలి అంతర్గత సమావేశాలతో పాటు బయట కూడా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంపై భారత్​ ఓకే మాటపై ఉందన్నారు తిరుమూర్తి. తీవ్రవాదాన్ని ఎదుర్కొనే ప్రయత్నాలను బలోపేతం చేయటమే కాదు, ఉగ్రవాద నిధుల సమీకరణను అడ్డుకోవటం, తీవ్రవాదంపై చర్యలను నీరుగార్చే ప్రయత్నాలపైనా దృషి సారించినట్లు చెప్పారు. గడిచిన ఏడు నెలల్లో భద్రతా మండలిలోని ఐదు శాశ్వత దేశాలతో భారత్​ మంచి సంబంధాలను కలిగి ఉందన్నారు తిరుమూర్తి. అలాగే.. ఇతర సభ్య దేశాలను కలుపుకొని ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: ఐరాస భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో భారత్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.