ETV Bharat / international

సోమాలియాలో ఆత్మాహుతి దాడి-ఐదుగురు మృతి

author img

By

Published : Jan 2, 2021, 10:29 PM IST

Updated : Jan 2, 2021, 11:15 PM IST

SOMALIA-SUICIDE
సోమాలియాలో ఆత్మాహుతి

సోమాలియా రాజధాని మొగదిషులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు టర్కీ పౌరులు ఉన్నట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రి ప్రకటించారు.

సోమాలియాలో ఆత్మాహుతి దాడులు నిత్యకృత్యమయ్యాయి. రాజధాని మొగదిషులో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 14మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి తామే బాధ్యులమని అల్​-షబాబ్ ప్రకటించింది. ఉగ్రవాదులు ఈ దాడికి మోటారు సైకిల్​ను ఉపయోగించారని టర్కీ సైన్యం తెలిపింది. మృతుల్లో ముగ్గురు టర్కీ పౌరులు కూడా ఉన్నారని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఫరెత్తిన్​ కోకా ట్వీట్ చేశారు.

ఈ మధ్యకాలంలో టర్కీ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దళాలు రెచ్చిపోతున్నాయి. ప్రస్తుత దాడి టర్కీ సైనిక స్థావరానికి 15కిలోమీటర్ల దూరంలో జరగడం గమనార్హం. ఈ దాడులను టర్కీ విదేశాంగ శాఖ ఖండించింది. తమ పౌరులపై జరిగే దాడులను సహించబోమని హెచ్చరించింది.

సోమాలియా సైన్యానికి మద్దతుగా నిలుస్తూ.. విద్య, వైద్య రంగాల్లో టర్కీ పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది.

ఇదీ చదవండి: తాలిబన్ల దాడిలో ఆరుగురు పోలీసులు మృతి

Last Updated :Jan 2, 2021, 11:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.