ETV Bharat / international

కరోనా కొత్త వేరియంట్- అన్నింటికంటే డేంజర్!

author img

By

Published : Aug 30, 2021, 3:40 PM IST

Updated : Sep 2, 2021, 9:32 AM IST

దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా వేరియంట్(south africa covid variant) ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఉన్న వైరస్ రకాలతో పోలిస్తే.. ఈ వేరియంట్​కు మ్యుటేషన్ రేటు అధికంగా ఉంది. ఈ వేరియంట్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

covid c.1.2 variant
సీ.1.2 కొవిడ్ వేరియంట్

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ రకం(south africa covid variant) మరింత ప్రమాదకరంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. దక్షిణాఫ్రికాలో తొలిసారి గుర్తించిన సీ.1.2 రకం కరోనా(c.1.2 variant).. వ్యాక్సిన్ నుంచి లభించిన రక్షణను ఎదిరించి మరీ వ్యాపిస్తున్నట్లు వెల్లడైంది. దక్షిణాఫ్రికాకు చెందిన జాతీయ అంటువ్యాధుల సంస్థ(ఎన్ఐసీడీ), క్వాజులు-నేటల్ రీసర్చ్ ఇన్నోవేషన్స్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్​ఫాం(క్రిస్ప్) సంస్థల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు.

అధిక మ్యుటేషన్

సీ.1.2 రకం కరోనా కేసులు చైనా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లో బయటపడ్డాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణాఫ్రికాలో కరోనా ఫస్ట్ వేవ్​లో తీవ్ర ప్రభావం చూపించిన సీ.1 రకంతో పోలిస్తే సీ.1.2 వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని చెప్పారు. ఆందోళనకర వేరియంట్, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్​తో పోలిస్తే సీ.1.2లో మ్యుటేషన్లు అధికంగా ఉన్నాయని వివరించారు.

సీ.1.2 మ్యుటేషన్ రేటు 41.8 శాతం ఉందని తెలిపారు. అంటే, సంవత్సరానికి 41.8 సార్లు వైరస్​లో మార్పులు సంభవిస్తాయని అర్థం. ప్రస్తుతం ఉన్న వైరస్ వేరియంట్ల మ్యుటేషన్ రేట్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం ఆందోళనకరం.

ఈ వేరియంట్​పై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం స్పందనతో పాటు.. భారత్​లో ఈ వేరియంట్ కేసులు ఎన్నికేసులు నమోదయ్యాయనే విషయం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

మరో వేరియంట్..

దక్షిణాఫ్రికా రకం కేసు వచ్చిన రెండు రోజులకే మరో వేరియంట్ బయటపడింది. ఇది కూడా టీకాలను ఏమార్చుతోందని ప్రాథమికంగా నిర్ధరించారు. ఆ వైరస్ గురించి వివరాల కోసం క్లిక్ చేయండి..

టీకా డెత్

మరోవైపు, న్యూజిలాండ్​లో వ్యాక్సిన్ కారణంగా తొలి మరణం(new zealand vaccine death) సంభవించింది. ఫైజర్ టీకా తీసుకున్న ఓ మహిళ.. హృదయ కండరాల వాపు సమస్యతో చనిపోయిందని అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించింది. టీకా కారణంగానే మహిళకు ఈ సమస్య తలెత్తి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధరించింది. మహిళకు అప్పటికే ఉన్న వైద్య సమస్యలు కూడా మరణానికి కారణమయ్యాయని వివరించింది.

అయితే, మహిళలో తలెత్తిన సమస్య అత్యంత అరుదైనదని వైద్యాధికారులు తెలిపారు. కరోనా బారిన పడటం కంటే.. టీకా తీసుకోవడమే సురక్షితమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: అమెరికాను వణికిస్తున్న 'ఇడా'​.. గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి!

Last Updated : Sep 2, 2021, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.