ETV Bharat / entertainment

సల్మాన్​ ఖాన్​ 'టైగర్​-3'కు మరాఠి సినిమా సవాల్! - డైరెక్ట్​ చేసింది ఎవరో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 3:47 PM IST

Tiger 3 Vs Naal 2 Movie : బాలీవుడ్​ బడా హీరో సల్మాన్​ ఖాన్​ నటించి 'టైగర్​-3' రిలీజ్​కు సవాల్​ విసురుతోంది ఓ మరాఠీ చిత్రం. ఆ వివరాలు..

Tiger 3 Vs Naal 2 Movie
Tiger 3 Vs Naal 2 Movie

Tiger 3 Vs Naal 2 Movie : బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్ నటించిన తాజా చిత్రం 'టైగర్​-3'. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' సినిమాల తర్వాత సల్మాన్​ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా నటించిన చిత్రం ఇది. YRF Spy Universe నుంచి రానున్న చిత్రం కావడం వల్ల 'టైగర్​-3'పై భారీ అంచనాలు ఉన్నాయి. దీపావళి కానుకగా ఈ సినిమా నవంబర్​ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే 'టైగర్​-3'కి పోటీగా తమిళ సినిమాలు 'జపాన్', 'జిగర్ తండా డబుల్ ఎక్స్' నవంబర్​ 10న విడుదల కానున్నాయి. టాలీవుడ్​ నుంచి మాత్రం ఈ వీకెండ్​లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల కానప్పటికీ.. ఓ తెలుగు డైరెక్టర్​ తీసిన మరాఠీ సినిమా 'నాళ్​-భాగ్​ 2'.. బాక్సాఫీస్​ వద్ద సల్మాన్ 'టైగర్​-3' ను ఢీ కొట్టేందుకు రెడీ అయింది.

లక్షన్నర బుకింగ్స్​.. పాన్​ ఇండియా లెవెల్​లో విడుదల కానున్న 'టైగర్​-3'కి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. సుమారు లక్షన్నర ప్రీ-బుకింగ్స్​ కూడా జరిగినట్లు తెలిసింది. అయితే సల్మాన్​ ఖాన్​ 'టైగర్​-3' మూవీకి ఏ స్థాయిలో హైప్​ క్రియేటైందో తెలిసిందే. అయినప్పటికీ.. ఏకంగా బడా హీరో సినిమాకే సవాల్​ విసురుతోంది 'నాళ్​-భాగ్​ 2'.

తెలుగోడి మరాఠీ మూవీ.. 2018లో వచ్చిన 'నాళ్' అనే బ్లాక్​ బస్టర్​ సినిమాకి సీక్వెల్​గా 'నాళ్​-భాగ్​ 2'ని తెరకెక్కించారు. ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ సుధాకర్ రెడ్డి ఎక్కంటి దర్శకత్వం వహించారు. ఆయనది అంధ్రప్రదేశ్ గుంటురు జిల్లా. సుధాకర్ రెడ్డి ఇదివరకు తెలుగులో 'పౌరుడు', 'మనసారా', 'మధుమాసం', 'కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు', 'దళం', 'జార్జ్ రెడ్డి' సినిమాలకు సినిమాటోగ్రాఫర్​గా పని చేశారు. ఇక 'నాళ్' సినిమా (మరాఠి)తో మెగాఫోన్ చేతపట్టారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమాకే జాతీయ అవార్డును కూడా అందుకున్నారు సుధాకర్​ ఎక్కంటి.

విమర్శకులు సైతం ప్రశంసించేలా 'నాళ్'​ పార్ట్​ 1 ను తెరకెక్కించారు సుధాకర్ రెడ్డి ఎక్కంటి. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్​ హిట్​గా నిలిచి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్​గా.. సుధాకర్ రెడ్డి 'నాళ్​-2' తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ -స్టూడియోస్​ ఈ సినిమాను నిర్మించింది. 'నాళ్​' మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడం వల్ల.. 'నాళ్​-2' కు మహారాష్ట్ర డిస్ట్రిబ్యూటర్లు సపోర్ట్​గా ఉంటూ కావాల్సిన మల్టీప్లెక్సులు, థియేటర్లను ఏర్పాటు చేస్తున్నారట. సింగిల్ స్క్రీన్లలో సైతం ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఇక 'టైగర్-3'కి టికెట్స్​ ఇప్పటికే బుక్ అయినా సరే.. జీ సంస్థ తన వంతుగా కొన్ని బుకింగ్స్​ను 'నాళ్​-2' కోసం ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోందట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

8000 మందితో సినిమా షూటింగ్​ - భారతీయుడి కోసం శంకర్​ భారీ ప్లాన్​​!

'ఆరోగ్యం దెబ్బతింది, సినిమాలు ఫ్లాప్, విడాకుల సమస్య'- సమంత ఎమోషనల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.