ETV Bharat / entertainment

'ఆచార్య'లో మహేశ్‌ కూడా.. థ్యాంక్స్​ చెబుతూ చిరు ట్వీట్‌

author img

By

Published : Apr 22, 2022, 10:48 AM IST

Updated : Apr 22, 2022, 12:17 PM IST

chiranjeevi ram charan movie
mahesh babu chiranjeevi

Mahesh Babu: సూపర్​స్టార్​ మహేశ్​బాబుకు కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్​ చిరంజీవి, మెగాపవర్​స్టార్ రామ్​ చరణ్. చిరు-చెర్రీ కాంబినేషన్​లో వస్తున్న 'ఆచార్య' సినిమాకు మహేశ్​ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు వారు స్పష్టంచేశారు. మహేశ్ గళంతో సినిమా మరింత ప్రత్యేకంగా మారనుందని మెగా హీరోలు పేర్కొన్నారు.

Mahesh Babu: మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ ప్రధానపాత్రల్లో నటించిన 'ఆచార్య'లో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూడా భాగమయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. పవర్‌ఫుల్‌ కథాంశంతో సిద్ధమైన ఈ సినిమాలో మహేశ్‌ కూడా ఉన్నారంటూ ఇటీవల వరుస కథనాలు చక్కర్లు కొట్టాయి. ఈనేపథ్యంలో పలువురు అభిమానులు, నెటిజన్లు.. ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఇవ్వాలంటూ చరణ్‌, చిరు, నిర్మాణ సంస్థలకు వరుస పోస్టులు పెట్టారు. కాగా, అభిమానుల నుంచి వస్తోన్న విజ్ఞప్తులపై తాజాగా చిరు స్పందించారు.

  • Dearest @urstrulyMahesh Delighted to have you introduce ‘Padaghattam’ in your endearing voice in #Acharya

    Thank you for becoming a part of the film in a very special way!! I am sure fans & audiences will be just as thrilled to hear you as much as @AlwaysRamCharan & I loved it!

    — Acharya (@KChiruTweets) April 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"డియర్‌ మహేశ్‌.. 'ఆచార్య'లోని పాదఘట్టాన్ని నీ వాయిస్‌ ఓవర్‌తో అందరికీ పరిచయం చేయనున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎంతో ప్రత్యేకమైన విధంగా ఈ సినిమాలో నువ్వు కూడా భాగమైనందుకు ధన్యవాదాలు. నీ వాయిస్‌ విని నేనూ, చరణ్‌ ఎంతలా థ్రిల్‌ అయ్యామో.. అదేవిధంగా అభిమానులు, ప్రేక్షకులు కూడా సంతోషిస్తారు" అని చిరు ట్వీట్‌ చేశారు.

ఇక, 'ఆచార్య' విషయానికి వస్తే కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దేవాలయాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం 'ధర్మస్థలి' పేరుతో ఓ భారీ సెట్‌ని క్రియేట్‌ చేశారు. పూజా హెగ్డే, కాజల్‌ కథానాయికలు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్స్‌ బ్యానర్స్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఏప్రిల్‌ 29న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

chiranjeevi ram charan movie
'ఆచార్య'కు యు/ఏ సర్టిఫికేట్
acharya
ఏప్రిల్ 23న 'ఆచార్య' ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో చిరు,చెర్రీ చేతుల మీదుగా 'శ్రీదేవి శోభన్​బాబు' ట్రైలర్

ఇదీ చూడండి: మంచిదాన్ని కాదు: కియారా.. నాకు ఇదే తొలిసారి: భూమి

Last Updated :Apr 22, 2022, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.